రుక్కూ మరియు రాం రుక్కూ ఇంట్లో భోజనం చేసి ఇద్దరూ అలా టీవి ముందు కూర్చున్నారు..
అప్పుడు రాం...
రుక్కూ.. ఎందుకు బుక్కు మొత్తం కాలీగా ఉందంటావ్ అన్నాడు రాం..
ఎమో నాకెం తెలుసురా..
అదికాదు రుక్కూ.. ఏదో ఉందిదాన్లో అది మనకు అర్ధంకాలేదు అంతే అన్నాడు రాం
అవును నేను వెల్లి పడుకుని అందులో ఏముందో నిద్రపోతూ ఆలోచిస్తా అనింది రుక్కూ నవ్వుతు..
ఎంటీ ఇప్పుడు నిద్రపోతావా అని ఆశ్చర్యంగా అడిగాడు రాం.
అదేంటి రాం అలా అడిగావ్..
ఎవరైనా పగలు పడుకుంటారా..అన్నాడు రాం మరలా
రేయ్ ఎంట్రా.. దేశంలో సగంమంది ఆడవాళ్లు మొగున్ని ఆఫీస్ కి పంపిచి ఏంచేస్తారనుకుంటున్నావ్ బాగా తిని ఇదిగో ఇలాగే టీవీ ముందు కూర్చుని చేతిలో రిమోట్ పెట్టుకుని అలాగేనిద్రపోతారు.. ఇప్పుడు ట్రెండ్ ఏంటో తెలుసా నిద్ర రావాలంటే టీవీ ఆన్లో ఉండాలి, రిమోట్ చేతిలో ఉండాలమ్మా.. అనింది రుక్కూ తమిళ్ సినిమా డైలాగ్ యాసలో
అందుకేనా 28 కాస్తా 34 అయింది అన్నాడు రాం..
అబ్బా ఎంత మెమొరీనో అనింది రుక్కూ..
సరే వెల్లి పడుకో అని రాం అనడంతో రుక్కూ వెల్లి పడుకుంది..
రాం ఇంటికి ఫోన్ చేసాడు..
హలో వల్లి ఏం చేస్తున్నావ్ అన్నాడు
ఏం లేదు రాం నువ్వు పట్టకొచ్చావే ఆ పిల్లకి కొంచెం కరాటే నెర్పిస్టున్నా అనింది..
ఎంటీ షాన్ కి కరాటే నెర్పిస్టున్నావా ఎందుకు.. ఎందుకంటావెంటి రాం ఈ రోజుల్లో స్త్రీకి ఆత్మ రక్షణ పద్దతులు ఎంత అవసరమో నీకు తెలుసు కదా అనింది రుక్కూ..
నిజమే అనకో.. కానీ జాగ్రత్త కాల్లు చేతులు విరగొట్టకు అన్నాడు రాం..
తనంటే నాకు ప్రాణం తనను జాగ్రత్తగా చూసుకో అన్నాడు రాం.. అలాగే అని కాసేపు ఫోన్ మాట్లాడి వెల్లి రుక్కూ పక్కన పడుకున్నాడు రాం..
ఎప్పటికో మెలుకువ వచ్చింది.. ఇద్దరికి
టైం చూసుకున్నారు సాయంత్రం అయింది..
రాం రెడీ అయి కిందికి వెల్లి కారులో ఎక్కడికో వెళ్లాడు..
రుక్కూ మాత్రం మొగుడు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్టాడా అని ఎదురు చూస్తుంది..
8 గంటలకి రుక్కూ హస్బెండ్ షరీఫ్ వచ్చాడు..
కాసేపు కబుర్లు చెప్పుకున్నారు
రుక్కూ డిన్నర్ రెడీ చేసింది..
రాంకి ఫోన్ చేసాడు షరీఫ్..
చిన్న పనుండి బయటికి వచ్చాను మీరు తినేసి పడుకోండి నేను రావచ్చు రాకపోవచ్చు అని సమాదానం చెప్పాడు రాం..
రుక్కూ, షరీఫ్ తినేసి పడుకున్నారు
సుమారు రాత్రి 11 గంటలకి రాం ఫోన్ చేసాడు రుక్కుకీ
హలో రుక్కూ.. కొంచెం డోర్ తీస్తావా అని అడిగాడురాం ఫోన్లో
రుక్కూ మెల్లగా వెల్లి తలుపు తీసింది..
రాం బయటే ఉండి.. రుక్కూ ఆ బుక్కు ఇస్తావా నేను ఇంటికి వెళుతున్నా అన్నాడు
ఎంట్రా.. ఈ టైం లో ఇంటికి వెల్తావా.. దెబ్బలు పడతాయి మూసుకుని వచ్చి పడుకో..
అదికాదు రుక్కూ..
నాకేమీ చెప్పకు వచ్చి పడుకో సీరియస్గా చెప్పింది రుక్కూ..
రాం లొపలొకి వచ్చాడు..
అసలు ఇప్పటివరకూ బయట ఏంటో నీకు పని.. ఐనా నీలాంటి వాడికి ఎన్నో పనులుంటాయనుకొ అవన్నీ నాకెందుకు..
కనీసం తిన్నావా అని అడిగింది..
రాం మౌనంగా ఉన్నాడు.. తిన లేదంటే మరలా తిడుతుందేమో అని
మౌనంగా ఉన్నావంటే తినలేడన్నమాట.. వెల్లి స్నానం చేయి తిందువుగాని అని చెప్పడంతో రాం వెల్లి రెడీ అయి వచ్చి రుక్కూ పెట్టిన బిర్యానీ తిని వెల్లి పడుకున్నాడు.. రుక్కూ వెల్లి మొగుడిపక్కలో పడుకుంది..
మద్యాహ్నం నిద్రపోవడం వలనో లేక బుక్కు లో ఏముందో తెలియకపోవడం వలనోగాని రాం కి నిద్ర రావడం లేదు..
అక్కడ మొగుడి పక్కలో ఉన్న రుక్కూ పరిస్తితి కూడా అంతే
కారణం ఏదైనా సమస్య ఒక్కటే నిద్ర పట్టడంలెదు..
రాం గదిలో ఒక్కడే పడుకుని ఉన్నాడు..
ఎందుకో వెల్లి కిటికీ తెరిచాడురాం.. తెల్లని వెన్నెల రాం గదిలోకి దూసుకొచ్చింది..
రాం గదిలోలైట్ ఆఫ్ లో ఉండటం వలన వెన్నెల కాంతి బాగా కనిపిస్తుంది..
అప్పుడు..
సడెన్గా రాంగదిలోకి రుక్కూ వచ్చింది..
కిటికీలొనుండి బయటికి చూస్తున్న రాం ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు రుక్కూ అమాంతం వచ్చి రాం ని కౌగిలించుకుని
బుజ్జి నిద్ర రావడంలేదురా ఒక కద చెప్పవా అనింది..
ఏమిటీ.. కథా.. నీకు పిచ్చిగానీ పట్టిందా..వెల్లి నీగదిలో పడుకో అన్నాడు రాం..
వంటి మీద బట్టలన్నీ తీసీ వెల్లి రాం ఎదురుగా బెడ్డుమీద పడుకుని వచ్చి కద చెప్పూ లేదంటే నేను ఇక్కడి నుండి పోను..అని గారాబం చేసింది రుక్కూ..
నీ ఆగడాలు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నాయి అన్నాడురాం
అవునురా ఎక్కువయ్యాయి వెచ్చని ఐస్ క్రీం ఎదురుగా ఉంటే రుచి చూడకుండా కిటికీలో చుస్తావెంట్రా అనింది రుక్కూ..
రేయ్ ఆ బుక్కు అంతా ఒక బూటకం అనుకుంటారా ఎవరైనా నక్షత్రాల వెలుగులో మెరుస్తారా చెప్పూ.. ఇప్పుడు నన్ను చూడు ఆ నక్షత్రాల వెలుగు ఆ వెన్నెల నా మీద పడుతున్నాయి నేనె మెరుస్తున్నానా అనింది రుక్కూ..
అప్పుడు అనిపించింది రాంకి బుక్కు ఎందుకు ఖాలీగా ఉందో..
వెంటనే రుక్కూ దగ్గరకు వెల్లి..
రుక్కూ వెల్లి ఆ బుక్కు తీసుకురా నేను నీకు కథ చెప్పడం కాదు ఆ బుక్కులో ఉన్న కథ నువ్వే నాకు చెబుదువుగాని అన్నాడు రాం
ఎంటీ ఇప్పుడాబుక్కు ఎందుకు అనింది రుక్కూ..
కద ఆ బుక్కులోనే ఉంది అన్నాడు రాం.
అది ఖాలీగా ఉందిగా అనింది రుక్కూ..
ముందు నువ్వు ఆ బుక్కు తీసుకురా మీ బెడ్రూంలో ఉంది వెళ్లు వెళ్లు అన్నాడు రాం..
రుక్కూ వెళ్తుంది.. బట్టలేసుకుని వెల్లవే అన్నాడు రాం
సర్లే అని నైటీ వేసుకుని వెల్లి బుక్కు తెచ్చింది..
రాం రుక్కూచేయి పట్టుకుని టెర్రస్ మీదకు వెళ్లాడు.. టెర్రస్ మీద ఒక మూలన కుర్చుని బ్యాగ్లో ఉన్న ఆ బుక్ బయటికి తీసాడు..
ఆ బుక్ వెన్నెల్లో మెరుస్తుంది..
ముక్యంగా ఆ బుక్కు మీద ఉన్న ఇద్దరమ్మాల ఫొటోలో ఒక యువతి దేహం మెరుస్తుంది..
రుక్కూ ఆశ్చర్యంగా కల్లు పెద్దవి చేసి బుక్కునే చూస్తుంది..
ఇప్పుడు చూడు బుక్కు ఎలా మెరుస్తుందో..అన్నాడు రాం
అవున్రా.. అనింది ఆశ్చర్యంగా
మెల్లగా మొదటి పేజీ తెరిచింది రుక్కూ
అందులొ అక్షరాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి..
రాం మరియు రుక్కూల ఆనందాన్ని ఆ క్షణంలో పైనున్న ఆ చంద్రుడే చూడాలి..
ఇప్పుడు అర్దమయిందారుక్కూ ఆ బుక్కుమీద రాసిన మాటకు అర్దం..
నక్షత్ర దూలికే తన ప్రియురాలి దేహం మెరిసి పోద్ది అని ఎందుకు రాసాడో.. అన్నాడు రాం
నిజంగా చెర్నాబి చాలా తెలివైన వాడు రాం..
ఐనా ఈ బుక్కు వెన్నెల్లో మేరుస్తదని నీకెలా తెలిసింది..అడిగింది రుక్కూ
నువ్వు నాగదిలో బట్టలు లేకుండా పడుకుని కద చెప్పూ అని అడిగినప్పుడు.. నాకు అనిపించింది ఎదైణా ఒక కదల పుస్తకం ఉంటే బావున్ను ఇప్పుడు.. ఏదో ఒక కద చెప్పి నిన్ను నిద్రపుచ్చాలని అనుకున్నా..
కానీ లైట్ ఆఫ్ చేసి ఉంది కదా బుక్కు ఎలా చదివి నీకు కద చెప్పగలను. చీకట్లో కుడా కనిపించే ఇంక్ తో రాసిన ఏదైణా కదల పుస్తకం ఉంటే బావున్ను అని అనిపించింది మరలా..
అప్పుడే నాకు ఈ బుక్కు గుర్తుకొచ్చింది..అన్నాడు రాం
అవును రాం పుస్తకాలన్నీ మాములు ఇంకుతో రాస్తారు లైట్ అవసరం లేకుండా చీకట్లో మెరిసే ఇంకుతో ఏబుక్కూ రాయలేదెందుకు ఇప్పటివరకూ అనింది..
ఇప్పుడు చదువు బుక్కులొ ఏముంది అన్నాడు రాం..
ఒక్క నిమిషం అని పరుగు పరుగున కిందికి వెల్లి రెండు పిల్లోలూ ముడు బెడ్ షీట్స్ తీసుకొచ్చి పక్క రెడీ చేసి..
ఎదురెదురుగా కుర్చునీ.. ఇద్దరూచెరో దుప్పటి కప్పుకుని మద్యలో ఆ బుక్కు పెట్టుకున్నారు..
రుక్కూ మొదటి పేజీ తెరిచిచింది
బుక్ లో మొదటి పేజీ
కొందరి జీవితాలు ఎప్పటికీ కాలంతో కలగలిసి ఉంటాయి..
అదేవిదంగా కొందరి మనసులు జన్మ జన్మలు ఒకటిగా కలిసి ఉంటాయనేది అనాదిగా ఉన్న మాట... అదే విది
నువ్వు ఈ గ్రందం చదువుతున్నావంటె అది యాదృచ్ఛికం కాదు
విదే ఈ గ్రందాన్ని నీ దగ్గరకు చేర్చిందని తెలుసుకో.
మా తాత ముత్తాతలు వారి జీవితంలో చూసిన సంగటనలను అడ్బుతాలను మాకు చెప్పినందున ఆ తరువాత మేము చూసిన సంగటనలను కలిపి ఈ గ్రందాన్ని రాయడం జరిగింది. ఈ గ్రందాన్ని రాయడంలో ఎందరో మెదావుల సలహాలు మాకు ఎంతగానో ఉపయోగ పడ్డాయి.
ఎందుకంటె ఈ గ్రందాన్ని రాయడానికి నాకున్న శక్థి సరిపోదుకనుక
" ప్రాణ త్యాగం చేసిన నాడే మనిషి దేవుడవుతాడు "
సైరస్ చక్రవర్తి దాదాపు సగం ప్రపంచాన్ని జయించి పాలిస్తున్న కాలం కి స్వాగతం.
ఈ కాలంలో సైరస్ చక్రవర్తిని ప్రజలు దేవుడుగా భావిస్తారు.
పచ్చిమాన జెరూసలెం నుండి తూర్పున సిందూ నది వరకు ఆయన పాలనలోనే ఉంది..
సిందూ నది అవతల ఉన్న హిందూ కుష్ ఆయన తదుపరి లక్ష్యం. కానీ హిందూకుష్ మీద దాడిచేయడమన్టె చిన్న ఈటెతో మదపుటేనుగుల గుంపుని మలేయడం అని ఆయనకు అర్దమయింది అందుకోసమె ఆయన సరైన సమయం కొసం ఎదురు చూస్తున్నారు.. కాని సైరస్ హిందూకుష్ మీద దండయాత్ర చేయకుండానే మరణించాడు.
ఆతరువాత ఆయన అఖండ సామ్రాజ్యం చిన్నాబిన్నమయింది ఎంతగా అంటె అతని కుమారుడు రెండవ సైరస్ ప్రస్తుతం మా రాజు నెబుకడ్నైజర్ చేతిలో ఓడి పోయాడు. ఒడి పోయిన రాజుయెక్క సింహాసనం ఇప్పుడు మా రాజు నెబుకడ్నైసర్ వశమయింది.
కానీ నెబుకడ్నైసర్ ఆ రాజ్యం మీద దాడి చేసింది సింహాసనంకోసం కాదు.. ఆ ఓడి పోయిన రాజు బార్య సౌదర్యం గురించి విని ఆమెను సొంతం చేసుకోవాలని.. కానీ ఈ సంగతి మా రాజ్యంలో కొందరు ముక్యులకు మాత్రమే తెలుసు.. మిగిలిన వారందరూ రాజ్యం కోసమే నెబుకడ్నైసర్ యుద్దం చేసాడని అనుకుంటున్నారు.
యుద్దంముగిసాకా ఆయన ఆ రాజ్యంలో ఉండే సంపదని మా రాజ్యానికి తరలించాడు మా రాజు నెబుకడ్నైసర్
పూర్తిగా ఆ రాజ్యం మా ఆదీనంలోకి వచ్చింది..అదే రోజు రాత్రి
గెలిచిన ఉత్సాహంలో వేడుకలు చేసుకుంటున్నారు మావాల్లు
ఓడిపోయిన రాజుయొక్కకోటలో ఒక సభా మందిరంలో ..
ఆ మందిరం ఓడిన రాజుయొక్క ప్రత్యేక మందిరం. అంది ఓడిన రాజు తన భార్యతో కలిసి ఏకాంతంగా గడపడానికి నిర్మించుకున్నది.
కానీ ఇప్పుడు మాకు అది విజయొత్సవ విలాస మందిరం అయింది.
మా రాజు నెబూ ఆ మందిరంలో ఒక సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని ఉన్నాడు.
అంతే కాదు ఆ మందిరంలో
మారాజుగారి ముక్య అనుచరులు, సైన్యంలో వివిద దళాలకు చెందిన అదిపతులు, కొందరు ముక్య వీరులు ఉన్నారు.
అందరూ కూడా మద్యం సేవిస్తూ యుద్ద రంగంలో వారు చేసిన వీరోచిత విన్యాసాల గురించి చెప్పుకుంటున్నారు.
ఓడిపోయిన రాజ్యంలోని యువతులు ఆ మదిరంలొ ఉన్న మావారికి మదువును సరఫరా చేస్తున్నారు వారిలో కొందరు యువతులు అర్ద నగనంగా మరి కొందరు పూర్తి నగంగా కూడా ఉన్నారు..
మా వీరులయితే ఆ యువతులతొ ఎంతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు..
కానీ ఆ యువతులు ఎమీ అనడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వారు ఓడిపోయిన బానిసలు.. ఎదిరిస్తె చంపెస్తారని భయం
అలా ఆ మందిరం మదువు, మగువలతో కోలాహలంగా ఉంది
ఆ సమయంలో
ఓడిపోయిన రాజు బార్యఅయిన రాణీ సిసీలియాను సంకెళ్ళతో మారాజుగారిముందు ప్రవేశ పెట్టారు కొందరు సైనికులు..
ఆమెతో పాటు మరి కొందరు యువతులను కూడా ప్రవేశ పెట్టారు..బహుశా వాల్లు ఆ రానియొక్క ప్రత్యేక దాసీలు అనుకుంటా..
ఆమె మా రాజు నెబూ ముందు తలదించుకుని నిలబడి ఉంది
ఆమెను చూసి మా రాజు నెబుకడ్నైసర్ ఇలా అన్నాడు.
నీ భర్తకు నువ్వు ఎన్నో బార్యవి అని ఆమెను అడిగాడు..నెబూ
ఆమె సమాదానం చెప్పలేదు
నీ పేరు.. సిసీలియా అని మేము విన్నాము సిసీలియా అంటే సులువైన మార్గంలో పొందలేని గొప్ప అందం అని అర్దం.
నిజమే మేము నిన్ను పొందడానికి చాలా కష్టపడ్డాము..కానీ మీరు మేము అనుకున్నంత అందంగా అయితె లేరు..
మా ప్రదాన అంతపురంలో ఉండే మామూలుచెలికత్తెకు ఉన్నపాటి అందం కూడా మీకు లేదు..
కనుక మేము మిమ్మలని మా అంతపురానికి తీసుకెల్లము..అన్నాడు
ఆమె మౌనంగా ఉంది తలదించుకుని..
అప్పుడు మా ప్రభు... ఆ మందిరంలో ఉన్న మిగిలిన ప్రముఖులను ఉద్దేసించి
నా ప్రియమైన మంత్రులారా, వీరులైన సైనికులారా ఈ విజయం మనందరిది మీ ధైర్య సాహసాల వలనే మనం ఈ విజయం సాదించాము..
అందుచేత మీలో ఎవరైనా ఈ సిసీలియాను మరియు ఆమెతో పాటు ఆమె వెనకాల నిలపడి ఉన్న చెలికత్తెలను కూడా సొంతం చేసుకోవచ్చు.. అని గట్టిగా అరిచి చెప్పాడు సింహాసనం మీద కుర్చుని..
ఆ మందిరం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది..
(చేతులకు సంకెళ్ళతొ మా రాజుగారి ముందు నిలబడ్డ ఆ రాణీ మౌనంగా ఉన్నా.. ఆమె మొహంలో మాత్రం ఏడుపు తెలుస్తుంది.
ఆమె ఇప్పుడు ఏ మందిరంలో ఆయితే సంకెళ్ళతో నిలబడిందో అదే మందిరంలో ఒకరోజు ముందువరకు ఆవిడ మహారాని..
కాని ఇప్పుడు ఆవిడ బానిస.. తన భర్త చంపబడ్డాడు.. కుటుంబం ఏమయిందో తెలియదు..
ఒకప్పుడు తన భర్త కూర్చునే సింహాసనం మీద వేరొకరు కూర్చుని ఉన్నారు ఇపుడు..
కానీ ఆమె ఏడుస్తుంది భర్త చనిపోయినందుకు కాదు.. రాజ్యం పొయినందుకు కాదు.)
ఇంతలో ఒక లావుపాటి బానకడుపు చూడ్డానికి ఏమీ అంత బాగోలేని పొట్టిగా ఉన్న 40 ఏళ్ల సైనికుడు ఒకడు రాజుగారి ముందుకు వచ్చి మోకరిల్లి తలదించుకుని..
ప్రభూ.. నాపేరు సినారో నాకు నలుగురు భార్యలు
కానీ వారిలో ఒక్కరు కూడా ఈ సిసీలీయా అంత అందంగా లేరు మీరు అనుఙ ఇస్తే ఈ సిసీలియాను నాతో తీసుకెళతా నా గ్రామానికి అని విదేయ పూర్వకంగా అడిగాడు వాడు..
అప్పుడు ప్రభువు..
నీకు ఇదివరకే నలుగురు భార్యలు ఉన్నారన్నావ్ మరి వారిలో ఎవరైనా ఈమెను నీ ఐదో భార్యగా అంగీకరించక పొతే ఏం చేస్తావ్ అని అడిగాడునెబూ...వాన్ని
అలా అయితె..మోహం తీరేవరకు ఈమెను నాతో ఉంచుకుని ఆ తరువాత వెరెవరికైనా విక్రయిస్తా ప్రభు అని చెప్పాడు...వాడు.
అలా అయితే సరే.. నీ గొప్పతనం ఎంటో చెప్పి ఆమెను నీవెంట తీసుకెల్లొచ్చు అన్నాడు ప్రభు..
టక్కున ఆదే మందిరంలో ఒక మూలన కూర్చుని ఒక నగణంగా ఉన్న యువతిని వల్లో కూర్చొపెట్టుకుని మదువు సేవిస్తున్న పదాతి దళపతి.. ఒల్లోఉన్న యువతిని విస్సిరి పడేసి లేచి నిలబడి..
ప్రభూ మీ ముందు ఉన్న ఆ సినారో మహా వీరుడు యుద్దంలొ వాడు ఒక్కడే వందమందిని చంపాడు అని చెప్పడంతో
భేష్ సినారో ఈ సిసీలియాను నీకు నా కానుకగా ఇస్తున్నా ఆమెను నువ్వు నీ వెంట తీసుకెల్లొచ్చు అని చెప్పాడు..
సినారో సిసీలియా చేతులకు ఉన్న సంకెళ్ళు విప్పి ఆమె చేయి పట్టుకున్నాడు.. అప్పటివరకు తలదించుకుని మౌనంగాఉన్న సిసీలియా అప్పుడు తల పైకెత్తి ప్రబువును చూసింది..
ఆ చూపులో ప్రభువుకి ఎదో అర్దమయింది..
ఒక్క క్షణం ఆగుసినారో అన్నాడుప్రభు.. సినారో ఆమె చేయి వదిలిపెట్టి పక్కన నిలపడ్డాడు..
నువ్వెమైనా అడగదలుచుకుంటే అడగొచ్చు అన్నాడు ప్రభు సిసీలియాని..
గుండెల్లోనుండి ఉబికే దుక్కంతో ఏడుపు లాంటి కంటంతో ఆవిడ అడిగింది
ఈ యుద్దం వలన నా ప్రాణానికి ప్రాణమైన నా కూతురు నాకు దూరమయింది.
అత్యంత సున్నిత మనస్కురాలు..పక్షులను జంతువులను కూడా మనుషులతో సమానంగా ప్రేమించే సున్నిత స్వభావంగల అమ్మాయి..తన జీవితంలో ఒక్క ప్రానికి కూడా హాని చేయని యువతి.. ఈ యుద్ద రక్తపాతం వలన బెదరి ఎటువెళ్ళిందో తెలియదు ఆమెనుమాత్రం బాదించకండి అని వేడుకుంది సిసీలియా..
అలాగే నీ కూతురు క్షెమంగా ఉండేలా మేము చూసుకుంటాము
ఆమె వయసు ఎంత అని అడిగాడు ప్రభువు..
పదునాలుగు అనింది సిసీలియా..
ఆ యువతి పోలికలెంటో చెప్పు అన్నాడు ప్రభు.
అత్యంత సుందరంగా ఉంటుంది అంత అందమైన యువతి మా రాజ్యంలో ఇంకెవరూలేరూ అనింది సిసీలియా..
వెంటనె మా ప్రభువు ఆ మందిరంలో ఉన్న సైనికుల వంక చూసి
సైనికులారా అటువంటి యువతిని మీలో ఎవరైనా చూసారా
అని అడిగాడు ప్రభు...
ఆ మందిరంలో ఉన్న అందరూ లెదు ప్రభు చూడలేదు ప్రభు అని చెప్పారు.
కానీ ఒక సైనికుడుమాత్రం లేచి తాగిన మైకంతో మాటలు తడబడుతూ చెప్పాడు.. నేను చూసాను ప్రభు అని
ఎక్కడ అని అడిగాడు ప్రభు..
అప్పుడు ఆ సైనికుడు ఆ మందిరం పక్కనే ఉన్న ఒక గదిని చూపించి ఆగదిలో చూసా అన్నాడు..
వెంటనే సిసీలియా పరుగున ఆ గదిలోకి వెళ్లింది వెనకాలే ప్రభువు కుడా వెళ్లాడు..
ఆ గదిలో ఏముందో చూసి ఆశ్చర్య పోయారు ప్రభు
మొదటి పేజీ పూర్తయింది
రాం ఈ బుక్ లో దాదాపు 2000 సంవత్సరాలక్రితం మద్యదరా ప్రపంచంలో జరిగిన సంగటనలగురించిఉంది అని చెప్పింది రుక్కూ గ్రందాన్ని చదవడం ఆపేసి
అంతే కాదు ఈ బుక్కుని ఒక సైనికుడు రాసాడు..
ఊ..ఊ..ఊ
అ.. త.. ని.. పేరు చెర్నాబి అని చెప్పింది రుక్కూ.
ఇతని తాత ఇతనికి ఎన్నో విషయాలు చెప్పాడంట వాల్ల రాజ్యంలో జరిగిన సంగటనలు గురించి వాల్ల రాజు చేసిన యుద్దాల గురించి ఇంకా ఎన్నో విషయాలు చెప్పాడంట
అప్పుడు రాం ఒక డౌట్ అడిగాడు రుక్కుని.
ఈ కథ 2000 ఇయర్స్ బ్యాక్ జరిగినదని ఎలా చెప్పావ్ అన్నాడు
మొదట్లోనే రాసాడుగా.. సైరస్ చక్రవర్తి పాలనాకాలానికి స్వాగతం అని..
సైరస్ చక్రవర్తి పాలించింది 2000 ఇయర్స్ బ్యాక్ అనింది రుక్కూ
అంతే కాదు ఈ సైరస్ చక్రవర్తి గురించి కురాన్ లో కూడా ఉంది.
ఏమని అన్నాడు రాం..
కురాన్ లో పేర్కొన్న దుల్కర్ నైన్ అనే వ్యక్తికి నరియు ఈ సైరస్ కి చాలా దగ్గరి పోలికలు ఉండటం వలన కురాన్లొ చెప్పిన ఆ దుల్కర్ నైన్ అనే వ్యక్తి ఈ సైరస్ ఒకరే అని కొందరు అంటుంటారు అనింది రుక్కూ.
ఇందులో రాసిన హిందూకుష్ రాజ్యంఏదో తెలుసా అనింది రుక్కూ..
తెలీదన్నట్టు తల అడ్డంగా ఊపాడు రాం..
మన భారతదేశమే అనింది రుక్కూ..
నీ డౌట్ క్లియర్ అయిందా.. సరే ఒప్పందం ప్రకారం ఏంచేయాలో తెలుసుగా అనింది రుక్కూ..
ఇదొకటుందికదా... చెప్పు ఏం చేయాలో అన్నాడు రాం..
టెర్రస్ మీద చలికి నువ్వు కప్పుకున్న ఆ దుప్పటి తీసీ నన్ను కప్పుకొ అనింది రుక్కూ..
నాకు నిద్రొస్తుంది నేను కిందికెల్లి పడుకుంటా అని ఆవులించుకుంటూ లెచి కిందికి వెళ్లాడు రాం..
వెనకాలే బుక్కు తీసుకుని రుక్కూ కూడా వెళ్లింది..
కిందికి వెళుతూ.. రాం ఈ బుక్కు చరిత్రకు సంబందించినది కదా మనతోపాటు రామలక్ష్మి కూడా ఉంటే బావుంటుంది కదా అనింది రుక్కూ..
ఇంకా ఉంది
[email protected]
Bạn đang đọc truyện trên: Truyen2U.Pro