yavvanam 34

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng

సమయం ఉదయం పది గంటలు అవుతుంది..
డాక్టర్ వచ్చి వల్లీ కట్టు మార్చి వెళ్లిపోయాడు..

వల్లీ బెడ్డుమీద పడుకుని టీవీ చూస్తుంది.. రాం అదే బెడ్డుమీద పడుకుని నేను ఒకసారి మన ఇంటికి వెల్లి షాన్ని చూసి వస్తా అన్నాడు రాం..

సరే వెల్లి రా.. నా గురించి అడిగితే రెండు రోజుల్లో వస్తుందిలే అని చెప్పు..అనింది వల్లీ.

సరే నువ్వు జాగ్రత్త అని వల్లీతో చెప్పి.. రాం రుక్కూ ఇంటికి వచ్చాడు..

అప్పటికే రుక్కు రెడీ అయి రాం కోసం ఎదురు చూస్తూ ఉంది..

చాలారోజుల తరువాత రుక్కూ డ్రెస్ వేసుకుంది.. ఆ డ్రెస్ కొంచెం టైటయ్యి రుక్కుశరీరం ఎత్తు పల్లాలుగా బయటికి కనిపిస్తుంది..

శారీలోనే నువ్వు అందంగా ఉంటావ్ అన్నాడు రాం..

ఐతే డ్రెస్ విప్పేయమంటావా అనింది రుక్కూ.. ఇప్పుడు అంత టైం లెదు త్వరగా రాం వెళదాం అని ఇద్దరూ కలిసి కారులో హాస్పిటల్ కి వెళ్ళారు..

ఇద్దరూ డాక్టర్ ఎదురుగా కూర్చున్నారు.. డాక్టర్ రుక్కూకి ఉన్న సమస్యను రాం రుక్కులకు వివరించ సాగాడు..

మీ సమస్య అంత పెద్దదేమీకాదమ్మాయ్ చాలా చిన్నది..సైంటిఫిక్ గా చెప్తే మీకు అర్దం కాకపోవచ్చు అందుకే సింపుల్గా చెప్తా..

సాదారనంగా స్త్రీ పురుషులిరువురు సెక్స్ లో పాల్గొన్నప్పుడు పురుష బీజ కణాలు స్త్రీ అండాశయంలోని స్త్రీ బీజ కణంతో కలవడం వలన జీవి ఏర్పడుతుంది.. అది పెరిగి తొమ్మిది నెలల తరువాత బిడ్డరూపంలొ జన్మిస్టుంది..  కానీ ఈ ప్రక్రియ అంత సులువుకాదు..

ఈ రోజుల్లో కుర్రాళ్లు  ఒక అమ్మాయిని పడేయడానికి నానా కష్టాలు పడుతున్నారు.. ఎన్నో సాహసాలు చెస్తున్నారు. ప్రాణాలకు తెగించి మరీ ఒక అమ్మాయి మనసు కొల్లగొడుతున్నారు..

అదే విదంగా ఆ అబ్బాయి.. ఆ అమ్మాయి కలిసి సెక్స్ లో పాల్గొన్నప్పుడు విడుదలయ్యె ఆ అబ్బాయి బీజ కణాలు అష్ట కష్టాలు పడి ప్రాణాలకు తెగించి చాలా దూరం ప్రయాణంచేసి స్త్రీ బీజ కనాన్ని చేరి ఆ కణం యొక్క గోడను బద్దలు కొట్టి అందులోకి ప్రవేశిస్టేనే ఫలదీకరణ జరిగినట్టు..

ఏంతో సాహసోపేతమైన ఈ ప్రయాణంలో  ఎంతో బలమైన బీజ కణాలు మాత్రమే బ్రతికి భట్టకట్టి స్త్రీ బీజ కనాన్ని చేరుకోగలవు

ఐతే మీ విషయంలో మాత్రం పురుష బీజకణాలు స్త్రీ బీజ కణాన్ని చేరడం చాలా కష్టమవుతుంది..
ఎంత బలమైన బీజకనాలైనా నీ స్త్రీ బీజ కనాన్ని చేరుకోలెకపోతున్నాయి.. దానికి కారణం మీ జననావయవంలో పురుష బీజ కణాలు ప్రయాణం చేసే మార్గం చాలా డ్రైగా ఉండటమే.. ఎంత జిగటగా ఉంటే పురుష బీజ కణాలు అంత వేగంగా ప్రయాణం చేసి స్త్రీ బీజ కనాన్ని త్వరగా చేరుకుంటాయి.. కాని మీ  విషయంలో ఆ మార్గం డ్రైగా ఉండటం వలన పురుష బీజ కణాలు వేగంగా ప్రయాణం చేయలేకపోతున్నాయి.. స్త్రీ బీజ కనాన్ని చేరేలోపే చచ్చిపోతున్నాయి..

సో.. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ వారి స్పెర్మ్ ని డైరెక్ట్ గా స్త్రీ బీజకణం దగ్గర ఇంజెక్ట్ చేస్తాను వెంటనే ఫలదీకరణ జరిగిపోతుంది.. శోభనం గదిలో భార్యా భర్తా కలిసి కష్టపడి మూడు రాత్రుళ్ళు చేసే పనిని నేను మూడు నిమిషాల్లో ముగిస్తానన్నమాట అన్నాడు డాక్టర్..

ఐతే నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందంటారా డాక్టర్ అనింది రుక్కూ..

యస్..కచ్చితంగా అన్నాడు డాక్టర్..

ఈరోజే స్పెర్మ్ ఇంజెక్ట్ చేద్దాం అన్నాడు డాక్టర్..

అలాగే చేయండి కాని ఇప్పుడు కాదు.. రేపు అన్నాడు రాం..

రుక్కూ షాక్ తిన్నదానిలా రాం వైపు చూసి ఎందుకు అనింది..

డాక్టర్ గారు ఒక్క నిమిషం.. అని రాం రుక్కూ చేయి పట్టుకుని హాస్పిటల్ ముందు చిన్న పార్కు ఉంటే అందులోకి లాక్కెల్లి..
డాక్టర్ ఏం చెప్పారో గుర్తుందిగా మీ హస్బెండ్ స్పెర్మ్ ని ఇంజెక్ట్ చేస్తా అన్నాడు.. అంటే దానర్ధం షరీఫ్ ది అని..ఆయన లేకుండా ఎలా అన్నాడు రాం.

రుక్కు సిగ్గుపడుతూ.. తలదించుకుని మెల్లగా నసుగుతున్నట్టు చెప్పింది.. సారీరా.. నీకో విషయం చెప్పాలి అని
ఏంటది అన్నాడు రాం.

ఎప్పటినుండొ ఒకటనుకుంటున్నా.. నా కడుపులో పెరగబోయె బిడ్డకి నువ్వే తండ్రిగా ఉండాలని అనింది రుక్కు..

ఈసారి షాక్ రాంకి తగిలింది..నీకెమైనా పిచ్చా..ఇందుకు నేను ఒప్పుకోను.. రేపు షరీఫ్ గారిని తీసుకుని రా.. పనవుద్ది. అన్నాడు రాం.. వాయిస్ పెంచి

నీ బిడ్డయితే ఒకే లేదంటే నాకసలు పిల్లలే వద్దు అనింది రుక్కూ.. మారాం చేస్తునట్టు..

నీకేమైనా పిచ్చా.. ఇలా చిన్న పిల్లలా మాట్లాడకు మూసుకుని రేపు షరీఫ్ని తీసుకునిరా అన్నాడు రాం కోపంగా..

కుదరదు..కుదరదు..కుదరదు అనింది రుక్కుకూడా కోపంగా..

అసలు నువ్వు నాకు ఎమవుతావని నా బిడ్డను నీ కడుపులో మోస్తా అంటున్నావ్ అన్నాడు రాం పెద్ద పెద్దగా అరుస్తూ కోపంగా..

నీ పెళ్ళాన్ని నేను.. నీతో తాళి కట్టించుకోక పోయినా.. నీతో ఏడడుగులు నడవకపోయినా.. నా మనసు, శరీరం నీతో పంచుకున్నా.. నీతో గడిపే ప్రతి క్షణంకూడా నిన్ను నా మొగుడుగానే భావించేదాన్ని అనింది రుక్కుకూడా గట్టి గట్టిగా అరుస్తూ..

చుట్టూ ఉన్న జనాలు వీల్లుద్దరినే చూస్తున్నారు..

చూడు రుక్కూ.. చిన్న పిల్లలా మారాం చేయకుండా చెప్పింది విను.. అందరూ మనల్నే చూస్తున్నారు. రా ఇంటికి వెళదాం అన్నాడు రాం.

రుక్కూ అలిగింది.. నేను ఇంకెప్పుడూ ఈ హాస్పిటల్ కి కూడా రాను అని పక్కనున్న బెంచీ మీద కూర్చుంది రుక్కూ.

సరే ఇంటికి వెళదాం రా అన్నాడు రాం..

నువ్వు వెళ్లు నేను రాను అనింది రుక్కు అలిగిన మొహంతో..బెంచీ మీద కుర్చునీ

ఇట్టా కాదని..రాం రుక్కూ చేయిపట్టుకుని బెంచీ మీదనుండి లేపే ప్రయత్నం చేస్తున్నాడు.. రుక్కూ రాం చేతిలోనూండి తన చెయిని విడిపొంచుకుని నేను రాను నన్ను తల్లిని చేస్తా అంటేనే వస్తా అనింది రుక్కూ కోపంగా..

అందరూ మనల్నే చూస్తున్నారు.. బావోదు చెప్పిన మాట విని రా అన్నాడు రాం..

చెప్తే అర్దం కాదా.. నువ్వు వెళ్లు అనింది రుక్కూ కోపంగా..

రాం మరలా రుక్కూ జబ్బ పట్టుకుని బల్లమీద నుండి లేపడానికి ప్రయత్నించాడు..

అసలు నువ్వు ఎవరు నా చెయ్యి పట్టుకోవాల్సిన అవసరం నీకేంటి అని రాం చెయ్యిని విసిరికొట్టింది రుక్కూ కోపంగా.. కల్లలో నీల్లు తిరుగుతూ..

రాం కి చిర్రెత్తుకొచ్చి.. చెల్లున ఒక్కటి పీకాడు రుక్కూ చెంపమీద.

రుక్కూ కల్లవెంట నీల్లు బడ బడా కారాయి.. ఏడవడం లేదు కాని కల్ల వెంట నీల్లు దారలుగా కారుతున్నాయి..

అది చూసి రాం కల్లలోకూడా నీల్లు తిరిగాయి..

ఇంతలో అక్కడికి ఒక పెద్దమనిషి వచ్చి ఏం పిల్లాడివయ్యా నువ్వు. ఆ అమ్మాయిని అలా ఎడిపిస్టున్నావ్.. పైగా చెంపమీద కొట్టావ్ అని రాం ని నానా మాటలు అంటున్నాడు..

రుక్కు మద్యలో కలగ చేసుకుని.. మూసుకుని నీ పని నువ్వు చూసుకో మా మద్యలో ఎందుకు వేలు పెడతావ్ అనింది..

అదికాదమ్మా అని ఆ పెద్ద మనిషి ఎదో చెప్పబోతూంటె.. ఇంకా ఇక్కడే ఉంటే తంతా అనింది రుక్కూ ఆ పెద్ద మనిషిని.. రాం మీద కోపం ఆ పెద్దమనిషి మీద చూపిస్తూ.

దాంతో ఆ పెద్ద మనిషి అక్కడినుండి వెళ్లిపోయాడు..

రాం రుక్కూ వైపు చూసి.. సరే ఇక్కడే ఉండు.. నేను ఇంటికి వెళతా..అన్నాడు రాం. ర్వర్స్ లో మారాం చెస్తునట్టు

ఆగూ నేనూ వస్తా అనింది రుక్కూ ఏడుపు మొహంతో కల్లు తుడుచుకుంటూ..

ఇందాక రానన్నావ్..అన్నాడు రాం లోలోపల నవ్వుకుంటూ

అప్పుడు కోపంలో అలా అన్నా అనింది రుక్కూ..అమాయకంగా

ఇప్పుడేమయింది ఆ కోపం అన్నాడు రాం..

కోపం అంతా ఆ ముసలాడి మీద చూపించా కదా.. పోయింది అనింది రుక్కూ..

రాం రుక్కూ గడ్డం పట్టుకుని సారీ బుజ్జీ.. అని ఎర్రగా కందిన రుక్కూ బుగ్గమీద ముద్దు పెట్టాడు..

రుక్కూ అమాంతం రాంకి లిప్పు కిస్సు ఇచ్చెసింది..చుట్టూ ఉన్న వాళ్లందరూ వీళ్ళిద్దరినే చూస్తున్నారు..

రాం రుక్కూలు కారెక్కి ఇంటికి వచ్చారు..

రుక్కూ తన ఫ్లాట్ కి వెళ్లింది..
రాం వల్లీ దగ్గరకు వచ్చాడు.
రాం వల్లీ దగ్గరకు వచ్చే సరికి వల్లీ, మధువనా కబుర్లు చెప్పుకుంటున్నారు..

🌟🌟🌟🌟🌟

మూడేళ్ల క్రితం జరిగిన కథ

హిందూ మహాసముద్రంలోనె అత్యంత లోతైన ప్రాంతమయిన దియమంతి ట్రెంచ్ లో మేరీ బర్త జోసెఫ్ పరిశోదనలు చేస్తున్నాడు..
ఆక్కడ పరిశోదనలు చేసేవారి పరిస్తితి ఎలా ఉంటుందంటె..ఒక బెలూన్ నిండా గాలి ఊది దాన్ని తీసుకెళ్లి ఒక ముల్ల కంచెకు కట్టిపడెస్తే దాని పరిస్తితి ఎలాఉంటుందో దియమంతి అకాతంలొ పని చేసే పరిశోదకుల పరిస్తితికూడా  అలాగే ఉంటుంది.
ఆక్కడ ప్రాణాలకు గారంటీ లేదు..
అటువంటిచోట చిమ్మ చీకటిలో నీటి అడుగున టార్చ్ లైట్లు వేసుకుని జోసెఫ్, ఆయన బృందం సముద్రం అడుగున 24000 అడుగుల లోతులో నడుస్తున్నారు..

అలా నడుస్తున్న వారికి ఒక గోడ అడ్డుగా వచ్చింది.. టార్చ్ లైట్ వెలుతురులో ఆగోడ పూర్తిగా కనిపించడం లేదు..
మెల్లగా వారు ఆ గోడను దాటారు.. గోడ అవతల ఒక ఉద్యాన వనం ఉంది.. ఆ ఉద్యాన వనంలో ఒక గుడి ఉంది. ఆ గుడి ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు నగనంగా కౌగిలించుకుని ఉన్న విగ్రహం ఒకటి ఉంది..  జోసెఫ్ ఆ గుడిలోకి వెళ్లాడు.. జోసెఫ్ బృందం మాత్రం నగనంగా ఒకరిని ఒకరు కౌగిలించుకుని ఉన్న  ఆ ఇద్దరంమ్మాయిల విగ్రహాన్ని చూడ్డానికి వెళ్ళారు.
విగ్రహాన్ని చూసిన జోసెఫ్ బృందం శిలలా ఉండిపోయారు..
ఆ అమ్మాయిల అందానికి వారు ఈ ప్రపంచాన్ని మరిచిపోయారు.
అందరూ ఒక్కసారిగా ఆ విగ్రహం ముందు మోకరిల్లి మమ్మల్ని నీలో కలుపుకో ఇంతటి అందాన్ని చూసిన మేము ఇకమీదట ఈ అందాన్ని చూడకుండా ఉండలెము.. నన్ను నీ జీవితకాలపు బానిసగా చేసుకో అని విగ్రహం ముందు మోకరిల్లి వెడుకుంటున్నారు..
సముద్రం ఉపరితలం మీద ఉండి సముద్రం అడుగున ఉన్న జోసెఫ్ బృందాన్ని మోనిటరింగ్ చేస్తున్న వారికి నీటి అడుగున జరుగుతున్నదేదీ అర్దంకావడం లేదు..
కొంత సేపటికి జోసెఫ్ గుడిలో నుండి బయటికి వచ్చాడు.. జోసెఫ్ కూడా ఆ విగ్రహాన్ని చూసాడు.. జోసెఫ్ కూడా వారిలాగే ఆ విగ్రహా అందానికి లోబడిపోయాడు.. కానీ కొంతసేపటికి అతి కష్టం మీద జోసెఫ్ తేరుకున్నాడు..  చుట్టూ చూస్తే తన బృందం అంతా ఆ విగ్రహ పాదాల దగ్గర మోకరిల్లి ఉన్నారు.. వారిని కూడా మన లోకంలోకి తీసుకురావడానికి జోసెఫ్ కి ఏడు గంటలు పట్టింది..

ఇక ఇక్కడ ఉండటం ప్రాణాలకే ప్రమాదం అని భావించిన జోసెఫ్ మిగిలిన వారిని వెంట పెట్టుకుని సముద్ర ఉపరితలానికి ఎగరడం మొదలు పెట్టాడు..కానీ బృందంలోని కొందరు మాత్రం ఆ విగ్రహాన్ని వదిలి రావడానికి మనసురాకనో లేక వారు పూర్తిగా ఆ విగ్రహానికి వసమయ్యారో తెలియదుగాని అక్కడే ఉండిపోయారు.. జోసెఫ్ మరియు మరో ముగ్గురు మాత్రం సముద్రం ఉపరితలంమీదకు వచ్చారు.. ఉపరితలానికైతే రాగలిగారు గాని వారు ఇంకా ఆ మాయలొనుండి పూర్తిగా బయట పడలేకపొయారు. ఉపరితలానికి రాగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ విచిత్ర చేష్టలు చెస్తున్న వారి ప్రవర్తన చూసిన పైనున్నవాల్లు. వారిని ఒక మానసిక వైద్యుని దగ్గరకు తీసుకెళ్లారు.. మానసిక వైద్యుడు ఆ నలుగురునీ బాగా పరిసీలించాక.. వీరు ఏదో తెలియని ఒక శక్తికిలోనయ్యారు.. వారి శరీరం ఈప్రపంచంలో ఉన్నప్పటికీ.. వారి మనసు మాత్రం ఇంకా ఆ శక్తి అదీనంలోనే ఉండటం వలన వీరు ఇలా ప్రవర్తిస్టున్నారనుకుంటా..
ఐనా పరవాలేదు మంచి ట్రీట్మెంట్ ద్వారా వీరిని కొంత కాలానికి మామూలు స్తితికి తీసుకురావచ్చనుకుంటున్నా.. ఒకవేల వీళ్లు మామూలు స్తితికి రాకపోయినట్లయితే ఇక ఎప్పటికీ ఇలా ఊహాలొకంలో బ్రతకవలసిందే..అన్నాడు ఆ మానసిక వైద్యుడు..

ఇప్పుడు వీళ్ల పరిస్తితి ఎంటీ డాక్టర్ అని అడిగారు. జోసెఫ్ బృందాన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెల్లినవాల్లు..

జోసెఫ్ గారి మీద ఆ ప్రభావం తక్కువగా ఉన్నట్లనిపిస్తుంది..ఎందుకంటే బలమైన మానసిక స్తితి కలిగినవాల్లు కొంత మేరకు ఇటువంటి ప్రభావాన్ని తట్టుకోగలరు. బలహీనమైన మానసిక స్తితి కలిగినవారు ఆత్మహత్య చేసుకున్నా   ఆశ్చర్య పడక్కర్లెదు..ఇక జోసెఫ్ గారు మన ప్రపంచానికీ ఉహాలొకానికి మద్య  ఆయన క్కొట్టుమిట్టాడుతున్నాడు..కానీ మిగిలిన వారి పరిస్తితి ఇప్పుడే చెప్పలేము అన్నాడు మానసిక వైద్యుడు..

సరే పదిరోజులు ఈ నలుగురినీ మీ దగ్గరే అబ్సర్వెషన్ లో పెట్టండి అని వాల్లు వెళ్లిపోయారు..
పదిరోజుల తరువాత జోసెఫ్ అక్కడినుండి ఇంటికి వచ్చాడు తను ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. బహుశా తన భార్య బయటికి వెల్లిందేమో అని తన దగ్గర ఉన్న మరో తాళంతో డోర్ తెరిచి లొపలొకి వెల్లి సొఫాలో కూర్చున్నాడు.. ఇంతలో జోసెఫ్ భార్య మేరీ వచ్చింది.. ఇంట్లో కూర్చుని ఉన్న తన భర్తను చూసి ఆశ్చర్యపోయింది మేరీ.. ఎప్పుడొచ్చారు వచ్చే ముందు చిన్న మాటైనా చెప్పలేదు సడెన్ గా వచ్చేసారెంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగింది మేరీ.. జోసెఫ్ ఏమీ సమాదానం చెప్పలేదు.. ఎంతకీ ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న జోసెఫ్ ని చూసి ఏమండీ అని గట్టిగా పిలిచింది మేరీ.. దాంతో ఈ లోకంలోకి చచ్చి ఎంటీ అన్నాడు జోసెఫ్.. మీరు ఎందుకు అప్పుడే వచ్చారు.. అని అడిగింది మేరీ..
మరలా సమాదానం లేదు..

పాపం చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు కదా అలసిపోయుంటారు. కొంచెం రెస్టు తీసుకుంటే అంతా సర్దుకుంటుంది అని రాజన్ అన్నాడు..

మెడ మీద గదిలోకి వెళ్లాడు.

చూడ్డానికి ఆ అద్భుతం ఒక గుడిలా ఉంది.. ఎక్కడ ఇలాంటి ఒక పురాతన గుడి ఉండటం అసాద్యం అసలు ఇక్కడ ఇది ఎందుకు ఉందో తెలుసుకుందామనీ పరిసోదిస్టుండగా అతనికి ఒక పెట్టె దొరికింది.. దాన్ని తీసుకుని అతను సముద్రం ఉపరితలానికి వచ్చాడు..అందులో ఏముందో తెలుసుకోవాలి అని దాన్ని తెరిచి చూసాడు. అందులో ఒక గ్రందం ఉంది. ఆగ్రందాన్ని తెరిచి చూసాడు అది ఖాలీగా ఉంది.. ఖాలీగా ఉన్న ఒక గ్రందాన్ని ఇంత భద్రంగా ఎవ్వరూ దాచుకోరు ఇందులో మనకు తెలియనిది ఏదో ఉంది.. దీన్ని మన లాబుకి తీసుకుని వెల్లి పరిసీలించాలి అని ఆ గ్రందాన్ని తీసుకుని ఇంటికి బయలుదెరాడు..హెలికాఫ్టర్లో ప్రయాణం చేసి గ్రందంతో సహా ఇంటికి వచ్చాడు.. ఇంటికి వచ్చిన అతనికి తన భార్య తన దగ్గర పని చేసె కుర్రాడితొ బెడ్డుపై నగణంగా ఉండటం చూసాడు..

రాజన్ భయం భయం గా లేచి బట్టలు వేసుకుంటున్నాడు..

భైరవద్వీపం సినిమాలో మాంత్రికుడు వేసిన మంత్రాని కథానాయిక బొమ్మలా ఎలా నడుచుకుంటుందో అలా జోసెఫ్ నడుచుకుంటూ వెల్లి మేరీ పక్కన  బెడ్డుపై కుర్చున్నాడు.

రాజన్ మెల్లగా బయటికి జారుకున్నాడు..

మేరీకి ఏమీ అర్దం కావడం లేదు..బిత్తరపోయి చూస్తుంది.

జోసెఫ్ మేరీ కళ్లలోకి సూటిగా చూస్తూ.. నాకు చనిపోవాలని ఉంది అన్నాడు

మేరీ కల్లు భయంతో ఇంకొంచెం పెద్దగా చేసింది..

నన్ను క్షమించండి ఏదో క్షనికాలోచనతో ఇలా చేసా, ఇంకెప్పుడూ మీ మనసు బాద పెట్టనూ.. అంటూ తన తరహాలో బాదతో జోసెఫ్ ని హత్తుకుని ఏడవడం మొదలు పెట్టింది..

మేరీ తన భుజం మీద తలపెట్టి ఏడుస్తుంటే.. జోసెఫ్ మాత్రం గాల్లొకీ చూస్తూ నేను ఆమెను మరిచిపోలేక పోతున్నాను..ఆమె లేకుండా క్షనమైనా జీవించలేను, ఆమె రూపమే నా కల్ల ముందు కదులుతుంది, నా మనసును తొలొచి వేస్తుంది, క్షణ క్షణం ఆమెను చేరాలనే కోరికతో నా తనువు రగిలి పోతుంది, ఈ వేదనను తట్టుకోవడం నావల్ల కావడంలేదు..మరణం మాత్రమే నన్ను ఆమె వద్దకు చేర్చగలదనిపిస్తుంది.. అందుకే నాకు చనిపోవాలని పిస్తుంది.. అంటూ చెప్పుకుంటూ పోటున్నాడు జోసెఫ్..

ఆ మాటలు విన్న మేరీ ఏడవడం ఆపి ఆశ్చర్యంగా చూసింది జోసెఫ్ మొహంవైపు..

జోసెఫ్ మాత్రం మెరీని పట్టించుకోకుండా కంప్యూటర్ బొమ్మలా మాట్లాడుతూనే ఉన్నాడు..

మేరీకి ఏమీ అర్దం కావడంలేదు..తనని అలా రాజన్తో  చూసి మతి చెలించిందేమో అని అనుకుందామంటే.. ఆమె, ఆమె రూపం అని ఎదేదో మాట్లాడుతున్నాడు..అసలు ఏమయింది ఈయనకి అని భుజం పట్టుకుని ఏవండీ..ఏవండీ అని గట్టిగా కుదిపింది.. జిసెఫ్ కొంచెం తేరుకుని మేరీ వైపు చూసి మేరీని గట్టిగా హగ్ చేసుకున్నాడు..

అసలు ఈ పరిస్తితిలో ఏం జరగాలి..ఏం జరుగుతూంది అని అనుకుంటుంది మేరీ మనసులో..
చిన్న పిల్లాడిలా జోసెఫ్ మెరీనీ హత్తుకుని.. నన్ను చంపేయ్ నాకు ఈ బాదనుండి విముక్తి ప్రాసాదించు అని బ్రతిమాలుకుంటున్నాడు..

వంటికి అడ్డంగా పెట్టుకున్న దుప్పటిని పక్కన పడేసి జోసెఫ్ ని తన మీదకు లాక్కుని.. మీకు ఏమీ కాదు మీరు బాదలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు.. అంటూ జోసెఫ్ గుండెల మీద పడుకుని అసలు మీకు ఏమయింది ఎవరామె అని అడిగింది మేరీ..

ఆమె ఒక అద్భుతం.. సకల మానవాళి హృదయాలను క్షణాల్లో హరించివేయగల మంత్రగత్తె.. మృత్యువుకు మరో రూపం.. పదునాలుగు భువన భాండాలలో ఎక్కడాలేని అపురూప సౌందర్యరాసి.. బ్లేడుతో కనుగుడ్డులను చీల్చినట్టు మనుషుల హృదయాలను కోస్తుంది.. నేను ఆమెకు బానిసను. అంటూ మాట్లాడుకుంటూ పొతున్నాడు జోసెఫ్..

అప్పుడు గ్రహించింది మేరీ.. జోసెఫ్ తనని రాజన్ తో నగనంగా బెడ్డుపై చూడటం వలన ఇలా అవ్వలేదని.. ఇది వేరే విషయంలా ఉందిఅనుకుని.. మెల్లగా బెడ్డుపై నుండి దిగి క్రింద హాల్లోకి వచ్చింది..

రాజన్ బట్టలు వేసుకుని కాలుగాలిన పిల్లిలా తచ్చాడుతూ ఉన్నాడు క్రింద హాల్లో.. మేరీ నగనంగా హాల్లోకి రావడం చూసి ఎంటీ ఏం జరిగింది లోపల.. కొట్టాడా, తిట్టాడా ఎమైనా అనాడా అంటూ కంగారు కంగారుగా అడిగాడు..

అదేం లేదు..ఎంటో ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు.. అనింది మేరీ..

నిన్నైతే ఏమీ చెయ్యలేదు కదా.. అన్నాడు రాజన్

నాకెందుకో ఆయన్ని చూస్తే భయంగా ఉంది.. చేతబడి చేసినవాడిలా మాట్లాడుతున్నాడు అనింది మేరీ..

ఇంతలో ఇంటిముందు పెద్ద శబ్దం.. ఎంటా అని రాజన్, మేరీలు బయటికి పరుగెత్తారు.. జోసెఫ్ మేడమీద నుండి క్రిందికి దూకి ఆత్మ హత్య చెసుకున్నాడు..

రెండు రోజులు తరువాత.. పోలీసులు జోసెఫ్ కి సముద్రం అడుగున పని అప్పగించిన కంపెనీ మనుషులు ఇంటికి వచ్చి పోతున్నారు.. మేరీ రెండురోజులుగా ఏడుస్తూనే ఉంది.

మేరీ కొడుకులుకూడా వచ్చారు..

జోసెఫ్ మానక స్తితి కారనంగానె ఆత్మ హత్య చెసుకున్నాడని పోలీసులు కేసు రాసుకున్నారు..

పోలీసులు ఇంటికి వస్తూ పోతూ ఉండటంతో.. మేరీ కొడుకులు మేరీని తమతోపాటు తీసుకుని పోవాలని అనుకున్నారు..

కానీ మేరీ..ఒప్పుకోలేదు, అందువల్ల కొడుకులు మేరీ ని వంటరిగా వదిలేయకుండా మెరీని చూసుకోమని రాజన్ ని నియమించి వారు వెళ్లిపోయారు..

కొన్ని వారాల తరువాత.. మేరీ జోసెఫ్ గదిని శుభ్రం చేస్తుంటే ఎందుకో అనుకోకుండా మేరీ దృష్టి కబొర్డ్ మీద ఉన్న ఒక బ్యాగ్ మీద పడింది.. దాన్ని క్రిందికి దించి చూస్తే అందులో జోసెఫ్ బట్టలతో పాటు ఒక పురాతన గ్రందం కూడా ఉంది.. మేరీ ఆ గ్రందాన్ని తెరిచి చూసింది. ఆ గ్రందం మొత్తం ఖాలీగా ఉండటంతో తిరిగి అదే బ్యాగులో పెట్టింది ఇంతలో ఆ గదిలోకి రాజన్ వచ్చాడు.. బెడ్డుపై కుర్చునీ జోసెఫ్ బ్యాగ్ ని సర్దుతున్న మేరీని చూసి మేరీ బంగారం ఏం చేస్తున్నావమ్మా అని వెల్లి పక్కన కూర్చున్నాడు..

ఈ బ్యాగు చూడు ఆయన ఆరోజు తన వెంట తీసుకొచ్చిన బ్యాగు  అని బ్యాగు చూపించింది..
హుమ్..బ్యాగులో చూసా జోసెఫ్ గారి బట్టలు ఆయన చదువుకునే పుస్తకాలు ఇంకా ఆయన వస్తువులు ఉన్నాయి.. వీటన్నింటినీ జాగ్రత్తగా ఆయన గదిలో నేను సర్దుతాకాని నువ్వు త్వరగా రెడీ అవ్వు.. చాలా షాపింగ్ చెయ్యాలి అన్నాడు రాజన్

చాలా షాపింగా ఎందుకు..చెరో జత బట్టలు కొనుక్కుంటే  సరిపోద్ది కదా అనింది మేరీ..

పిచ్చి మొద్దు పెళ్ళంటే మాటలా.. ఉదయం రిజిస్టారు ఆఫీసుకి వెళ్లేటప్పుడు ఇద్దరికీ చెరో జత బట్టలు.. తరువాత రాత్రికి శోభనం గదిలోకి ఇంకో జత బట్టలు.. ఆ తరువాత ఇంకా ఇంకా చాలా ఉన్నాయిలే ముందు నువ్వు త్వరగా రెడీ అవ్వు.. ఈ లోగా ఈ బ్యాగు సంగతి నేను చూసుకుంటా అన్నాడు రాజన్..

దాంతో మేరీ రెడీ అవుతుంది.. రాజన్ బ్యాగు సర్దుతుంటె అందులో ఒక డైరీ కనిపించింది రాజన్ కి.. ఇది జోసెఫ్ డైరీలా ఉందే అని తెరిచి చదవడం మొదలు పెట్టాడు..

డైరీలో..

:-      నేను హిందూ మహాసముద్రం అడుగున పరిశోదనలు
        చేయడానికి దియమంతి అకాతంలొకి వెళ్లాను.

:-      ఆక్కడ మేము ఒక గుడిని చూశాము ఆ గుడిలో ఏంతో
        కట్టుదిట్టమైన భద్రతలమద్య దాచి ఉంచిన  ఒక గ్రందాన్ని. 
        నేను కనుగొన్నాను..

:-      అది ఎంతో ముక్యమైన గ్రందం అని నాకు
        అర్ధంమయింది..అందుకే దాన్ని నా వెంట తీసుకొచ్చా
        ఎవరికీ తెలియకుండా.

:-      ఆ గ్రంధం దాదాపు రెండువేల సంవత్సరాల క్రితంది
        అయిఉండొచు అని నా అంచనా..

:-      హిందూ మహాసముద్రం అడుగున ఎన్నో ఏళ్లుగా మనం
        పరిశోదనలు సాగిస్తున్నాం.

:-      గ్రందంలో ఉన్న సమాచారం చాలా నిగూడంగా భద్రపరిచి
        ఉండొచ్చు అనుకుంటున్నా.. అందుకే అది ఖాలీగా ఉన్నట్టు
        కనిపిస్తుంది..

:-      ఈ రోజుల్లో ఇటువంటి పరిఙానాన్ని గురించి
        చెప్పాలంటే..రెట్రో రిఫ్లెక్షన్ అని చెప్పొచ్చు..

:-      వివరంగా చెప్పాలంటే.. మనం రాయాలనుకున్న విషయం. 
        ముందుగా కాగితం మీద రాసి దానిపై ఏదొ లెపనాన్ని అద్ది
        ఉండొచ్చు..
        పలుచని పొరలా ఉన్న లేపనం. కాగితం చుట్టూ ఉన్న
        వస్తువులనుండి పరావర్తనం (రిఫ్లెక్ట) చేందిన కాంతిని
        గ్రహించి. తిరిగి వక్రీబవింప చేయడం ద్వారా లేపనం క్రింద
        ఉన్న సమాచారాన్ని మన రెటీనా గ్రహించలెకపోవచ్చు..
        అందుకు కారణం లేపనం నుండి విడుదలయ్యే వికిరన  
        దృగ్గొచర కాంతి పటలం యొక్క తరంగదైర్గ్యము, మన కన్ను
        గ్రహించగలిగే దృగ్గొచర కాంతిపటలపు తరంగ దైర్గ్యము వేరు
        వేరుగా ఉండటమే. లేదా ఎక్కువగానూ లేక తక్కువగాను
        ఉండటం వలనకూడా కావచ్చు..

:-      బహుశా.. సూర్యుడు విడుదల చేసే వికిరనశక్తి
        విద్యుదయస్కాంత తరంగ రూపంలో ఉంటుంది. దీని
        తరంగ దైర్గ్యం 380 nm నుండి 760 nm మద్య ఉంటుంది.
        అందువలన మన కన్ను వెలుతురులో ఉన్న వస్తువులను
        చూడగలుగుతుంది.కాని కాగితం మీద పూసిన లెపనంమీద
        వక్రీకరనంచెందే కాంతిపుంజంయొక్క తరంగందైర్గ్యం
        380-760 కి మద్య కాకుండా ఎక్కువగా, లేదా తక్కువగా,
        లేదా ఇందుకు భిన్నంగా ఉంటే ఆ పేపరు మీద ఉన్న
        సమాచారాన్ని వెలుతురులో ఉన్నా కూడా మనం
        చూడలేము..అని నా ఉద్దెశం

:-      నా మనసు సముద్రం అడుగున ఏదో గుర్తు తెలియనిశక్తి
        తాకిడికి గురైందని నాకు వైద్యం చేసె మానసిక వైద్యుడు
        చెప్పాడు.. నేను పూర్తి స్తాయిలో స్పృహ కలిగి లేనని
        చెప్పారు. నాకు గుర్తున్న కొన్ని విషయాలు ఇందులో.  
        రాశాను..

డైరీలోని ఈ విషయం చదివాక రాజన్ కి ఒక్కముక్కా అర్దం కాలేదు.. కానీ  రాజన్ కి ఒకసారి ఆ గ్రందాన్ని చూడాలని అనిపించింది..బ్యాగులోనుండి ఆ గ్రందాన్ని బయటికి తీసాడు గ్రందాన్ని తెరిచి చూస్తే గ్రందం మొత్తం కాలీగా ఉంది.. సరేలే మనకు ఎందుకు అని దాన్ని మరలా అదే బ్యాగులో పెట్టాడు రాజన్.

ఇంతలో ఆ గదిలోకి మేరీ వచ్చింది రెడీ అయి.. రాజన్,మెరీలు అలా బయటికి వెళ్ళారు.. మంచి డైమండ్ రింగులు కొనడం కోసం ఒక జూవెలరీ షాపుకి వెళ్ళారు..

ఆశ్చర్యంగా అదే షాపులో రామలక్ష్మీ, రాం లు కూడా ఉన్నారు..

రాం ని చుడాగానే హాయ్ రాం ఎలా ఉన్నావ్ అని అడిగాడు రాజన్..

బావున్నా నువ్వెలా ఉన్నావ్ చాలా రోజులైంది రాం నిన్ను చూసి అన్నాడు రాజన్..

రాం ఈమే మా బాస్ వైఫ్.. పేరు మేరీ అని మెరీని రాం కి పరిచయం చేసాడు రాం..

మేడమ్ వీడు నా ఫ్రెండ్ పేరు రాం..ఇంకా ఈమే నా పాత కొలీగ్ పేరు రామ లక్ష్మీ అని ఇద్దరినీ పరిచయం చేసాడు రాజన్

ఇలా వచ్చారేంటి అని రాజన్ అడిగాడు రామ లక్ష్మీని..

నెక్లెస్ ఒకటి కొనడానికి వచాము అని చెప్పింది రామ లక్ష్మీ

మీరు ఎందుకు వచ్చారు అని అడిగింది రామ లక్ష్మీ..

మేరీ మేడమ్ ఏవో కోణాలట అందుకే వచ్చాము అన్నాడు రాజన్..

ఇంతలో రాం కల్పించుకుని.. వాల్లిద్దరూ వాళ్లకు కావాల్సినవి సెలెక్ట్ చెసుకుంటారుగానీ.. మనం అలా వెల్లి కొంచెం తీరిగ్గా మాట్లాడుకుందాం రా అని రాం, రాజన్ లు అలా షాపులో ఓ పక్కగా వెల్లి కూర్చున్నారు..

మీ బాసు.. హిందూ మహాసముద్రం అడుగున చేసే పరిశోదన ఎంతవరకు వచ్చింది అని అడిగాడు రాం..

ఆ పరిశోదన మద్యలోనే ఆగిపోయింది అన్నాడు రాజన్

ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు రాం..

మొన్నీమద్యనే మా బాస్ చనిపోయారు..అన్నాడు రాజన్

అయ్యో పాపం అని జాలి వ్యక్తం చేసాడు రాం..

దేని గురించి మీ బాసు హిందూ మహాసముద్రం క్రింద పరిశోదనలు చేస్తున్నాడు అని అడిగాడు రాం..

ఏమో నాకూ పూర్తిగా తెలియదు అన్నాడు రాజన్..

ఇంతలో మేరీ రామ లక్ష్మీలు వచ్చారు.. ఇక వెళదామా అనడంతో మేరీ రాజన్ లు వారి కారులో...  రాం,రామలక్ష్మీలు వాల్ల కారులో ఎవరి దారిన వాల్లు వెళ్లిపోయారు..

మరుసటి రోజు.. రాజన్ మరియు రామ లక్ష్మీలు ఒక పార్కులో కలుసుకున్నారు..పొదల మాటున కూర్చుని మాట్లాడుకుంటున్నారు..

ఎందుకు అంత ఖర్చు పెట్టి నెక్లెస్ కొన్నావ్ నిన్న అన్నాడు రాజన్

ఊరికే వస్తే కాదనడం ఎందుకని కొన్నా..అనింది రామలక్ష్మీ

ఊరికేనా.. అన్నాడు రాజన్ ఆశ్చర్యంగా.

అవును.. తాజుమహల్  షాజాహాన్ యొక్క సమాది. కానీ తాజ్ మహల్ లోపల ఉన్నది షాజాహాన్ యొక్క నిజమైన సమాది కాదు.. అది వట్టి డమ్మీ.. నిజమైన సమాది తాజ్ మహల్ క్రింద ఉన్న నేలమాలిగలో ఉంది.. దాన్ని చూడ్డానికి ఎవరికీ అనుమతి ఉండదు..కానీ కొందరు ఆర్కియాలజీ వాల్లకి అనుమతి ఉంది. అటువంటి ఒక ఆర్కియాలజీ పరిశోదకుడు ఒకరు నాకు తెలుసు.. ఆయని సహాయంతో రాం ఆ సమాదిని చూడ్డానికి అనుమతి తెప్పించా.. రాం కి ఎప్పటినుండో ఆ సమాదిని చూడాలని ఉందట.. ఆ సహాయానికి గుర్తుగా చిన్న నెక్లెస్ కొనిచ్చాడు అనింది రామలక్ష్మీ

ఎంటీ చిన్న మాట సాయానికి నెక్లెస్సా..అన్నాడు రాజన్ ఆశ్చర్యంగా..

మరి 15వా శతాబ్డం నాటి సమాది.. దాన్ని చూడ్డడం అంటే మామూలు విషయమా అనింది రామ లక్ష్మీ..

ఏం.. అసలు ఆ సమాదిని ఎందుకు చుడాలనుకున్నాడు రాం.. అని అడిగాడు రాజన్.

వాడికి ఈ పురాతన విషయాల పట్ల ఆశక్తి ఎక్కువలే అనింది రామ లక్ష్మీ..

హో అందుకేనా నిన్న నన్ను గుచ్చి గుచ్చి అడిగాడు..మీ బాసు ఎంచేస్తుంటాడు అని..

నువ్వేం చెప్పావ్..అనింది రామలక్ష్మీ

నాకు తెలియదు అని చెప్పా.. అన్నాడు రాజన్

పోనీలే..అనింది రామ లక్ష్మీ..

15వా శతాబ్దపు సమాదికే నెక్లెస్ కొనిస్తె నేను చెప్పే విషయం వింటే ఎమిస్తాడొ అన్నాడు రాజన్..

ఎంటా విషయం అనింది రామ లక్ష్మీ

మా బాస్ సముద్రం అడుగునుండి ఒక గ్రందాన్ని తీసుకొచ్చాడు దాదాపు రెండువేల సంవత్సరాల క్రితంది అన్నాడు రాజన్..

రామ లక్ష్మీ ఆశ్చర్యంగా... రెండువేల సంవర్సరాల క్రితందా.. ఎక్కడుంది ఆ గ్రందం అనింది రామలక్ష్మీ..

మేరీవాల్ల ఇంట్లో అన్నాడు రాజన్..

ఆగ్రందం లో ఏముంది..అనింది రామలక్ష్మీ

ఏమో.. అంతా ఖాలీగా ఉంది. కానీ ఆ గ్రందంలొ  ఏదో ఉందని జోసెఫ్ గారు ఆయన డైరీలో రాసుకున్నారు.. అని చెప్పాడు రాజన్..

సరే..ఒక పనిచెయ్ కుదిరితే ఆ గ్రందాన్ని ఒకసారి నాకు చూపించగలవా అనింది రామలక్ష్మీ..

ట్రై చేస్తా.. ఆ గ్రందం మీరీ గారి బర్త రూంలో ఉంటుంది.. దాన్ని ఆమె బయటికి ఇవ్వకపివచ్చు.. అన్నాడు రాజన్

పరవాలేదు కుదిరితే తీసుకురా లేదంటే లెదు అనింది రామలక్ష్మీ..

🌟🌟🌟🌟🌟

ప్రస్తుతం

రామ లక్ష్మీ రాంకి ఫోన్ చేసింది..

హలో మెమ్ చెప్పండి ఎలా ఉన్నారు అని అడిగాడు రాం

నేను బావున్నాను రాం.. కానీ నీకే ఒక ముక్యమైన విషయం చెప్పాలని పదిరోజులనుండి ట్రై చెస్తున్నా.. కొంచెం ఫ్రీగా ఉంటే వచ్చి కలవరాదు అనింది రామలక్ష్మీ..

సారీ మేమ్.. చిన్న పనిపడి కేరలా వెళ్లా.. అక్కడే పదిరోజులు ఉండాల్సి వచ్చింది.. మొన్నే వచ్చా ఇప్పుడు రుక్జానాగారి ఇంటి దగ్గరె ఉన్నా.. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి వచ్చి కలుస్తా అన్నాడు రాం..

ఇవ్వాలా సాయంత్రం వచ్చి కలువు నేను ఫ్రీగానె ఉంటా అనింది రామలక్ష్మీ..

అలాగే మెమ్.. ఈవినింగ్ కాలేజీ పక్కనున్న కాఫీ షాపులో కలుద్దాం అన్నాడు రాం..

అలాగే తరువాయి భాగంలో కలుద్దాం అనింది రామలక్ష్మీ

ఇంకా ఉంది
[email protected]

కుదిరితే 21వ భాగంలో 9వ పేజీమొత్తం మరియు పదవ పేజీలో నాలుగు లైన్లు చదవండి..

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro