yavvanam 37

Màu nền
Font chữ
Font size
Chiều cao dòng


మేరీ వంటరి ఐపోయింది..  ఇంట్లో ఒంటరిగా దిగాలుగా కూర్చుని ఉంది.. కట్టుకున్నవాడు పోయాడు, కనీసం ఉంచుకున్న రంగా ఐనా తోడుగా ఉంటాడనుకుంటె వాడు కనిపించడంలేదు..
మేరీ భర్త చనిపోవడంతో భర్త చేసే ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది,  అలెక్జాండర్ తక్షశిలనుండి ఎత్తుకొచ్చిన విలువైన రత్నం గురించి రంగా మరుయు మేరీలు కలిసి సంపాదించిన సమాచారం అంతా వృదా ఐపోయింది..
ఇక ఇంట్లో ఒంటరిగా, భారంగా రంగా ఙాపకాలతో ఈ మూడేళ్ల నుంచి గడుపుతూ ఉంది..

🌟🌟🌟🌟🌟

అర్ధరాత్రి.. మేడ మీద వెల్లకిలా పడుకొని ఆకాశంలోకి చూస్తూఉన్న ఒక కుర్రాడు.. అప్పటి వరకు ఆకాశంలో ఉన్న ఒక నక్షత్రం ఉన్నట్టుండి మాయం అవడం చూసి తనకు వచ్చిన ఒక ఆలోచనని అనుసరించి ఈ మూడు సంవత్సరాలలో ఎక్కడెక్కడో తిరిగి ఎంతో సమాచారాన్ని సంపాదించాడు, రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంగటనలను పొందుపరచబడ్డ ఒక బుక్కుని సంపాదించాడు, దేవ కన్య లాంటి షాన్ని సంపాదించాడు మరియు ఎన్నో విషయాలను తెలుసుకొన్నాడు..
ఇతనికి అలా మూడేళ్లు గడిచాయి..
మరో రెండేళ్లు ఒక బౌద్ధ సన్యాసి దగ్గర శిష్యరికం చేశాడు..

తను సంపాదించిన షాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు
తను సంపాదించిన బుక్కు ని చదవడం మొదలు పెట్టాడు

ఆ బుక్కు చదవడం ఇంకా పూర్తి కాలేదు

       ఇంతటితో మూడు సంవత్సరాల క్రితం నుంచి జరిగిన కథ ముగిసింది ఇక ప్రస్తుతం జరగాల్సిన కథ చూద్దాం

🌟🌟🌟🌟🌟

కట్టుకున్నవాడు పోయాడు ఉంచుకున్నవాడు కనబడడం లేదు వంటరిగా దిగులుగా ఏం చేయాలో తెలియక ప్రతిరోజు భారంగా గడుపుతుంది మేరీ..
అలా ఒకరోజు మేరీ తన ఇంట్లో సొఫాలో కూర్చుని ఒంటరిగా ఏదో బుక్ చదువుతూ ఉంది..

ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన శబ్దం విని బుక్కు పక్కన పెట్టి వెల్లి తలుపు తీసింది.. ఎదురుగా రామ లక్ష్మీ ఉంది..
రామలక్ష్మి మేరీని చూసి కొన్ని నిమిషాల పాటు మౌనం గా ఉండిపోయింది..ఆ క్షణం రామ లక్ష్మీ కంటికి.. మేరీ వయసు మీద పడిన దానిలా కనిపించింది..

ఒకప్పుడు నేను చూసిన మేరీ లాగా నువ్వు లేవు అనింది రామలక్ష్మి ..

లోపలికి రా అనింది మేరీ

ఇద్దరూ వెల్లి సొఫాలో కూర్చున్నారు ఎదురెదురుగా

రామలక్ష్మీ మేరీ వైపు చూసి.. " ఎలా ఉన్నావ్ "  అని నిన్ను ఇప్పుడు అడిగితే అది కచ్చితంగా అనవసర మైన ప్రశ్నే అవుద్ది.. ఎందుకంటె నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు ఎలా ఉన్నావో అని.. అనింది రామలక్ష్మీ..

మేరీ దిగాలుగా..గుడ్ నాకేం బాగానే ఉన్నానే అనింది

ఎందుకు ఇంతలా కృంగిపోయావొ నాకర్ధంకావడంలా

చాలా రోజుల క్రితం నువ్వు రంగాని తీసుకొచ్చి నాకు అప్పగించావు.. వాడూ, నేను బాగా దగ్గరయ్యాము

ఉన్నట్టుండి వాడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు
నువ్వు కూడా నా దగ్గరకు రావడం మానేశావు

గత కొన్ని నెలలుగా ఈ ఇంట్లో ఒంటరిగా గడుపుతున్న నేను ఇలా కాక ఇంకెలా ఉంటాను అని బాధతో చెప్పింది మేరి

సారీ మేడం ఈ మధ్యన రామ్ అని నా స్టూడెంట్ ఒక్కడు చిన్న ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు ఆ పని మీద ఉండి ఇటువైపు రాలేకపోయాను..

ఏంటా ప్రాజెక్ట్ అని అడిగింది మేరీ అదంతా పెద్ద కథ లే ఇప్పుడు అది ఎందుకుగానీ నీ గురించి చెప్పు ఇకమీదట ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అని అడిగింది రామలక్ష్మి

ఏదో అలా గడిపేస్తున్న అనిందిమేరీ దిగాలుగా

సరే నాతో పాటు మా ఇంటికి వస్తావా అనింది రామలక్ష్మి

నువ్వు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళిపోతావు, మరల ఈవినింగ్ వస్తావు, అప్పటివరకు నేను ఒంటరిగా నీ ఇంట్లో ఉండాలి సో అక్కడైనా ఇక్కడైనా ఒకటే కదా అనింది మేరీ..
పైగా మీవారికి పిల్లలకు మద్య నేను ఎందుకు

లేదు నేను ఇప్పుడు లెక్చరర్ జాబ్ మానేసి వేరే బిజినెస్ చేస్తున్న అనింది రామలక్ష్మి

ఏంటా బిజినెస్ అనింది మేరీ పురాతనమైన ఆంటిక్ పీసెస్ కలెక్ట్ చేసి ఎగ్జిబిషన్ లో పెట్టి అమ్ముతుంటాను

అయితే నీకు నా సహాయం కావాలి అందుకే వచ్చావా ఇన్ని రోజుల తర్వాత  అనింది మెరి మొహంమీదే

నీకు అబద్ధం చెప్పలేను..  మీరన్నది నిజమే అనుకోండి అని బదులిచ్చింది రామలక్ష్మి

నీకు అపారమైన హిస్టారికల్ నాలెడ్జ్ ఉంది మీ వారి ద్వారా మీకు ఆర్కియాలజి డిపార్ట్ మెంట్ లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి నా కోసం పని చేయండి వచ్చిన లాభంలో మీకు వాటా ఇస్తా అనింది రామ లక్ష్మీ

మేరీ మౌనంగా ఉంది..

మేరీ మౌనంగా ఉండటం చూసిన లక్ష్మీ

మీకు ఆరోజు గుర్తుందా మేడమ్ ఆనింది రామ లక్ష్మీ

ఏరోజు అనింది మేరీ

అదే.. మీరు టీచర్ గా ఉన్నప్పుడు.. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు..
మన స్కూలు యానివర్సరీడే రాత్రి.. స్కూల్లో అందరూ స్కూలు గ్రౌండ్ లో కల్చరల్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు.. కానీ  ఒక మాథ్స్ టీచర్ ఇంకా అస్సలు మాథ్స్ రాని ఒక స్టూడెంట్ మాత్రం ఆ కల్చరల్ ప్రోగ్రాం చూడ కుండా స్కూలు వెనకాల ఉన్న పొలంలో అర్ధరాత్రి వెన్నెల్లో వంటి మీద బట్టలు లేకుండా ఒకరిని ఒకరు పెనవెసుకుని ఆ పండు పున్నమి రాత్రిని ఆస్వాదిస్తున్నారు..

కల్చరల్ ప్రోగ్రాం లో భాగంగా ఒక అమ్మాయి స్టేజి మీద పాడే ఒక పాట స్కూలు వెనకాల పొలంలో పడుకుని ఉన్న  వీరికి వినిపిస్తుంది..
ఆ పాటను వింటూ ఆ మాథ్స్ టీచర్ ఈ పాటంటె నాకు చాలా ఇష్టం.. ఆ పాట వింటూ ఉంటే నా మనసుకి ఒకవిదమైన అనుభూతి కలుగుతుంది అని చెప్పి.. మరి నీకు ఏమంటే ఇష్టం అని ఆ స్టూడెంట్ ని అడిగింది.. అప్పుడు ఆ స్టూడెంట్ నాకు మా మాథ్స్ టీచర్ అంటే ఇష్టం తన పక్కన ఉంటే నా మనసు స్వర్గంలో విహారిస్తున్నట్టు ఉంటుంది అనింది..

దాంతో ఆ టీచర్ ఆ స్టూడెంట్ పెదవులను మెత్తగా కొరికి నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు అనింది..

ఇప్పుడు ఆ స్టూడెంట్ ఒక సహాయం అడిగింది కానీ ఆ టీచర్ మౌనంగా ఉంది.. అని బరువెక్కిన హృదయంతో చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది రామ లక్ష్మీ..

🌟🌟🌟🌟🌟

        

          జాహ్రా తన మందిరం లో ప్రయోగం కోసం సాండ్రాని సిద్దం చేస్తుంది..

గది నిండా వేపాకు మండలు కట్టింది, గదిలో నేల మీద వేపాకు పరిచారు.. గది నిండా పసుపు నీల్లు గోమూత్రం చల్లారు.

ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ గదిలోకి ఒక రహస్య మార్గం గుండా బాబిలా వచ్చింది.
ఆమెతోపాటు తార మరియు ఐదుగురు గర్భవతులైన స్త్రీలుకూడా వచ్చారు..
ఆ సమయంలో బాబిలాను అక్కడ చూసి సాండ్రా మరియు మోనీకాలు ఆశ్చర్యపోయారు..

గది లోపలికి రాగానే బాబిలా తార వైపు చూసి...
తారా ఈ ఐదుగురిని తీసుకువెళ్లి ఆ గదిలో కూర్చోబెట్టు అని చెప్పింది..
తార అలాగే అయిదుగురు ని తీసుకొని పక్కనున్న గదిలోకి వెళ్ళిపోయింది.

జాహ్రా బాబిలా వైపు చూసి.. రా కాశీ ఎన్నెళ్ళయింది నిన్ను చూసి.. ఈరోజు కోసమే కదా ఎదురుచూస్తున్నాను ఎలా ఉన్నావు అంటూ ఆహ్వానించింది..

ఇకపోతే.. నీకు తెలుసుగా తను సాండ్రా ఆ పక్కన ఉన్నది ఆమె స్నేహితురాలు మోనిక అని బాబిలాకి వాళ్ళిద్దరినీ పరిచయం చేసింది జాహ్రా..

శాండ్రా కి ఏమీ అర్థం కాక.. ఏంటక్క ఏం జరుగుతుంది ఇక్కడ.. బాబిలా ఇక్కడికి రావడం ఏమిటి, అసలు ఆ అయిదుగురు గర్భవతులు ఎవరు ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం అనింది సాండ్రా..

అదంతా తరువాత చెప్తాను.. మోనిక నువ్వు లోపలికి వెళ్లి అయిదుగురు గర్భవతులను ఈ ప్రయోగానికి సిద్ధం చెయ్ ఆనింది జాహ్రా..

అలాగే అంటూ మోనిక లోపలికి వెళ్ళింది

బాబిలా సాండ్రా వైపు చూసి.. తను చాలా బలంగా ఉంది ఈ ప్రయోగానికి తను తట్టుకుంటుందనుకుంటున్నా.. అనింది

అవును నాకు అలాగే అనిపిస్తుంది అనింది జాహ్రా

సరే జాగ్రత్త ఇక నేను వెళ్లి వస్తా నువ్వు అడిగిన అయిదుగురు గర్భవతులను నీకు అప్పగించాను అని తారను తీసుకుని బాబిలా అక్కడనుండి వెళ్లిపోయింది..

అలాగే వెళ్లి రా అనింది జాహ్రా..

బాబిలా తారలు వారి మందిరానికి వెళ్లారు..

తారా మనం కొన్నాల్లపాటు సముద్రయానాం చెయబోతున్నాము అందుకు తగ్గ ఏర్పాట్లు చేయి అనింది బాబిలా

నీవు శిక్షణ ఇప్పించిన స్త్రీ సైనికులు ఉన్నారు కదా వారు కూడా మనతోపాటు వస్తారు అనింది బాబిలా

అలాగే అమ్మ అని తార అక్కడినుండి వెళ్లిపోయింది..

ఇంతలో అక్కడికి నెభూ వచ్చాడు..  వస్తూనే బాబిలాను తన కౌగిలిలోకి తీసుకుని చూశావా నాదేహం కొలిమిలో పడ్డ ఇనుమువలే ఏలా సలసలా మరురుగుతుందో అన్నాడు..

మీ వేడిని చల్లార్చడానికి ఏడుగురు భార్యలు ఉన్నారు.. కోట నిండా వేస్యలు ఉన్నారు.. ఈ రాజ్యంలో ఏ కన్యైనా నువ్వు మనసుపడితే నీ పక్కలో చేరాల్సిందే..అనింది బాబిలా

ఎంతమంది అందగత్తెలైనా నీ కాలి గోటికి సరిపోరు, అన్నాడు నెభూ..

కానీ నేను కొంత సమయం కావాలని అడిగానుకదా అనింది బాబిలా..

ఇంకా ఎంత సమయం అన్నాడు నెభూ..

నేను కొంతకాలం విహారయాత్రకు వెల్లి రావాలి అనింది బాబిలా..

వెల్లి వచ్చాక నాకోరిక తీరుస్తావుగా అన్నాడు నెభూ

కచ్చితంగా తీరుస్తా అనింది బాబిలా..

సరే చెప్పు ఎటు వెళతావు అన్నాడు నెభూ.

నేను దక్షిణంగా పడవ ప్రయాణం చెయ్యాలనుకుంటున్నా అనింది బాబిలా..

సరే అందుకు తగ్గ ఏర్పాట్లు చేయిస్తా ఈరోజే నువ్వు బయలుదేరవచు అన్నాడు నెబూ.. కానీ ఈ విషయం చాలా రహస్యంగా జరగాలి అనింది బాబిలా

అలాగే.. ఇప్పుడే ఏర్పాట్లు చేయిస్తా అని అక్కడినుండి వెళ్లిపోయాడు నెభూ..

ఆ రోజు రాత్రి ఎవరికంటా పడకుండా బాబిలా, తార
మరియు ఓడలో పనిచేయడానికి మరికొంత మంది సిబ్బందితో కలసి బయలుదేరింది బాబిలా

ఆ ఓడలో  ఉన్నవారందరూ స్త్రీలే..

🌟🌟🌟🌟🌟

బాబిలా మరియు తారలు అక్కడి నుండి వెళ్లి పోయాక

జాహ్రా తన మందిరానికి ఉన్న అన్ని ద్వారాలను కిటికీలను మూసివేసింది ఇక ఆ మందిరంలో కి రావడానికి ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది ఆ దారికి నలుగురు సైనికులను కాపలాగా ఉంచ్చింది..

ఆ సైనికులతో ఈ ద్వారం గుండా నా మందిరంలోకి ఎవరూ రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే..  ఎవరైనా లోనికి వస్తే వచ్చిన వారితో పాటు మీ నలుగురి తళలు కూడా నరికించేస్తా అని చెప్పింది జాహ్రా..

అలాగే అని ఆ నలుగురు సైనికులు బయటనుండి తలుపులు మూసేసి తలుపు అడ్డంగా నిలబడి ఉన్నారు
ఇక మందిరం లోపల జాహ్రా, మౌనిక, సాండ్రా మరియు ఐదుగురు గర్భవతులు మాత్రమే ఉన్నారు

మౌనిక మరియు సాండ్రాలు.. బాబిలాకి, జాహ్రాకి మధ్య ఇదివరకే పరిచయం ఉందా అని మాట్లాడుకుంటున్నారు గుస గుస మని..

ఏమో ఆమెనే  అడిగితే పోలా అనింది మౌనిక

అనుకున్నదే తడవుగా

అక్కా..  బాబిలా ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అడిగింది సాండ్రా..

అది చెప్పాలంటే ఇంకొన్నేళ్లు ముందుకి వెళ్లాలి మనం అనింది జాహ్రా..

నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా నాన్నగారికి ఒక వ్యాధి సోకింది.. ఆయనను మా రాజ వైద్యులకు చూపించాము.. వారు ఈ వ్యాధి మహా మొండిది దీనికి మందు లేదు మరణమే శరణ్యం అని చెప్పి వెళ్లిపోయారు..

మా అమ్మ ఒక్కటే ఏడుపు..మా నాన్నకు వచిన ఆ వ్యాది నయం అవ్వాలని మా అమ్మ చేసిన ఆ పని నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది

మా అమ్మ చుట్టుపక్కల రాజ్యాలనుండి ఎందరో రాజ వైద్యులను పిలిపించి మా నాన్నగారికి వైద్యం చేయించాలని చూశారు కానీ ఎవ్వరూ కూడా ఆ వ్యాధిని నయం చేయలేక పోయారు. రోజు రోజుకి మా నాన్నగారి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది అప్పుడు తూర్పు దిక్కున ఉన్న ఒక దేశం నుండి చానిక్య చంద్రగుప్త అనే ఒక వ్యక్తి మా రాజ్యానికి వచ్చారు.. ఆయన చూడటానికి బాగా వయసు మీదపడిన గొప్ప సాదువులా ఉన్నారు..

  ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేయడానికి మా అమ్మ ఒహారా టొరూక్ గారే స్వయంగా వెళ్లారు..

మా అమ్మ ఆయన్ని కలిసి.. అయ్యా నాపేరు వహారా టొరూక్.. నేను కలీఫా హరున్ టొరూక్ గారి పట్టపు రాణిని.. మీరు మా రాజ్యానికి రావడం మాకు సంతోషంగా ఉంది..

అప్పుడు ఆయన మా అమ్మగారిని ఒక మాట అడిగారు

సాధారణంగా రాజ్యానికి ఎవరైనా అతిది వస్తే ఆ అథిదిని ఆహ్వానించడానికి రాజు గారు వస్తారు కానీ ఇక్కడ రాణిగారు వచ్చారు.. అంటే ఆ రాజు అపాయంలో ఉండి ఉండాలి, లేదా రాజ్యంలో లేకుండా ఉండి ఉండాలి అని చెప్పారు..

దానికి మా అమ్మగారు చాలా బాగా చెప్పారు.. నిజానికి మా రాజుగారు ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు ఇప్పుడు బయటికి వచ్చే పరిస్థితిలో ఆయన లేరు
అందువలన నేనువచ్చాను మిమ్మలను ఆహ్వానించడానికి అనింది.

అయితే ఇది నేను స్వాగత సత్కారాలు పొందే సమయం కాదు.. సరాసరి నన్ను రాజుగారి దగ్గరకు తీసుకు వెళ్ళండి అని మా అమ్మతో ఆయన చెప్పారు.

అప్పుడు మా అమ్మ ఆయనను సరాసరి మా నాన్న దగ్గరకు తీసుకు వెళ్ళింది..

ఆయన మా నాన్నగారికి సోకిన వ్యాధి ని బాగా పరిశీలించి ఇదేమీ అంత భయంకరమైన వ్యాధి కాదు దీనికి కూడా మందు ఉంది అని చెప్పారు ఆయన

అలా అయితే ఆ మందు ఎక్కడ దొరుకుతుంది ఈ వ్యాధిని నయం చేయగల వైద్యుడు ఎక్కడ ఉన్నాడొ సెలవివ్వండి ఇప్పుడే నేను వారిని ఎక్కడికి పిలిపిస్తాను అంది మా అమ్మ

అది.. హిమాలయపర్వత దిగువభాగాన గంగానది తీరాన ఉన్న ఒక పట్టణం అక్కడే ఈ వైద్యుడు ఉన్నాడు.. అతని పేరు మనక్ అతను కచ్చితంగా ఈ వ్యాదిని నయం చేస్తాడు అని చెప్పారు ఆయన..

అలా ఐతే ఈ క్షనమే నేను వారిని ఇక్కడికి రప్పించడానికి ఏర్పాట్లు చేస్తాను.. దానికంటే ముందు మీరు మా అథిది మీరు ఏ పని మీద వచ్చారో తెలుసుకోవడం మా కర్తవ్యం అనింది వహారా టొరూక్

ఆరోజు రాత్రి మా అమ్మా నేనూ స్వయంగా భోజనం తీసుకుని చానిక్యులవారు ఉన్న అథిది గృహంకి వెళ్లాము

ఆయన భోజనం చేస్తూ.. నేను సైరస్ చక్రవర్తిని కలవడానికే ఇంత దూరం వచ్చాను.. ఇది చాలా ముక్యమైన పని అందుచేత వేగులకు పురమాయించకుండ మా రాజుగారు అశోక చక్రవర్తి తల్లిగారు నన్ను పంపారు అని చెప్పారు ఆయన..

ఐతే మీ పని సులువైనట్లే.. ఎందుకంటే మా వారు సైరస్ గారిదగ్గర సామంత రాజు.. కనుక మేము మిమ్మల్ని రేపు ఉదయాన్నే సైరస్ గారిదగ్గరకు తీసుకుని వెళ్తాము అనింది వహారాటొరూక్..

ఆయన భోజనం చెయడం పూర్తయింది.. నేనూ మా అమ్మ అక్కడినుండి వెల్లిపొయాము.

అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు అతను చాలా బలంగా యుద్ద వీరుడిలా ఉన్నాడు.. వస్తూనే చానిక్యులవారికి నమస్కారం చేసి..అయ్యా నాపేరు యూప్రటీస్ నేను ఈ పక్కనే ఉన్న ఒక రాజ్యానికి సేనాదిపతిని మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు..

ఇంత రాత్రి సమయంలోన అన్నారు చానిక్యులువారు
కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఇదే సరైన సమయం అన్నాడు యూప్రటీస్..

సరే చెప్పండి.. మీ వంటి మహా ఙానిని కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా.. మీ చక్రవర్తి అశోకుడు ఇప్పుడు పచ్చిమంగా తన దండయాత్రను కొనసాగించి హిబృను మట్టికరిపించాడు.. ఇక మిగిలింది అస్సిరినల్లు ఆ తరువాత మేము ఐగుప్తులు అస్సిరియన్ల నాయకుడు సైరస్ మహా వీరుడు ఆయన్ని ఎదిరించడం గెలవడం చాలా కష్టం.. కనుక మేమూ మీతో చేతులు కలుపుతాము ఇద్దరం కలిసి అస్సిరియన్లను ఒడిద్దాం ఒడిపోయిన రాజ్యం మీకేసొంతం అన్నాడు యూప్రటీస్..
మరి మీకేంటి లాభం అన్నాడు చాణక్యలువారు..

మీ చక్రవర్తితో స్నేహం అన్నాడు యూప్రటీస్..

సరే ఆలోచిద్దాం అన్నాడు చాణక్య

మరుసటి రోజు ఉదయం వహారా టొరూక్  చానిక్యులవారిని తీసుకుని సైరస్ గారి దగ్గరకు వెళ్లింది..

సైరస్ గారు వహారా టొరూక్ ని చూసి మీ వారికి ఇప్పుడు ఏలా ఉంది అని అడిగాడు..

మావారి పరిస్థితి ఇదివరకటి ఇలాగే ఉంది.. కానీ నేను ఇప్పుడు వచ్చింది మా వారి గురించి మాట్లాడడానికి కాదు.. ఇదిగో నా పక్కన ఉన్నారే ఈయన పేరు చాణక్యచంద్రగుప్త
ఈయన తూర్పు నుండి వచ్చారు మిమ్మల్ని కలవడానికి అని చెప్పింది వహారా టొరూక్..

సైరస్ చానిక్యులవారివైపు తిరిగి..
అయ్యా మీ గురించి విన్నాను.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను.. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.. చెప్పండి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు సైరస్..

మీతో ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు చానక్యులువారు..

అలాగే కానీ.. మీరు ఎంతోదూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి ఆ తరువాత మాట్లాడుకుందాం అన్నాడు సైరస్..

దాంతో వొహారా టొరూక్ ఇక నేను వెల్లిరానా అని అక్కడినుండి తిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయింది..

చానిక్యులవారు సైరస్ గారి అథిది మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు..

ఈలోగా సైరస్.. తన మంత్రులను పిలిచి సమావేశ పరిచి ఆయని రాకకు కారణం ఎమిటో తెలియడంలేదే అని తన మంత్రులను అడిగాడు..

సైరస్ మంత్రులలో ఒకరు.. ప్రభూ వారి రాజ్యం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది.. అలెక్జాండర్ హిమాలయాలను దాటి వారి రాజ్య సరిహద్దులో కాపుకాశి ఉన్నాడని మనకు కొంత కాలం క్రితమే  సమాచారం అందింది..బహుశా అలెక్జాండర్ని ఎదిరించడానికి మన సహాయం కోరడానికి వచ్చారేమో అన్నాడు..

అదే నిజమైతే మనం ఇందులో జోక్యం చేసుకోకూడదు ఎందుకంటే అలెక్జాండర్ని ఎదిరించడం మన వల్లేకాదు.. ఈ భూమ్మీద ఎవరివల్లాకాదు అన్నాడు మరొక మంత్రి..

మరోక వృద్ద మంత్రి ముందుకు వచ్చి ప్రభూ.. అలెక్జాండర్ని మట్టికరిపించడం చానిక్యునికి పెద్ద కష్టమేమి కాదు అన్నాడు..

నీకెలా తెలుసు అన్నాడు సైరస్..

మీకు ముందుగా చానిక్యుని గురించి చెప్తా వినండి అని ఆ వృద్ద మంత్రి చెప్పడం మొదలు పెట్టాడు..

     చానిక్యుని నాన్నగారు ఒక ఉపాద్యాయుడు.. అందువల ఆయనకు విద్య, ఙానం యొక్క విలువ బాగా తెలుసు.. అది దృష్టిలో పెట్టుకుని తన కొడుకుని పెంచి పెద్దచేసాడు

ఆరోజుల్లో నంద సామ్రాజ్యం అంటే అందరికీ భయం.. వారి మంత్రి రాక్షస జాతికి చెందిన వాడు.. అందువలన ఆ సైన్యాన్ని రాక్షస సైన్యం అంటారు.. వారు దేనికీ ఎవరికీ భయపడరు.. అప్పటి నందవంశ సైన్యం ఇప్పుడున్న అలెక్జాండర్ సైన్యంకన్నా ఎన్నో రెట్లు పెద్దది..
అలాంటి రాక్షస సైన్యంతో నందులు రాజ్యాలని కబలించి ఎదురులేని నంద సామ్రాజ్యాన్ని స్తాపించారు..

ఆ సనయంలో చానిక్యున్ని నందవంశ రాజుగారి ఆస్తానంలో పండితునిగా ఉద్యోగంలో చేర్పించాడు చానిక్యుని తండ్రి..

ఐతే ఒకరోజు చాణక్యుడు నందరాజుల సభకు వచ్చి అందు గల ఒక  పీటము మీద కూర్చున్నాడు. నందులు అక్కడికి వచ్చి ఉత్తమ పీఠమునందున్న చానిక్యున్ని చూసి
ఆ పేద బ్రాహ్మణునికి అంత మర్యాదలు అవసరం లేదు అని చిన్నచూపుతో చనిక్యుడు కూర్చునిఉన్న సింహాసనమునుండి కిందికి లాగాడు రాక్షసమంత్రి ..
ఇది అక్రమమనీ, పండితులు పూజనీయులనీ చానిక్యుడు చెప్పాడు.. కానీ ఆ సభలో ఎవ్వరూ పిల్లవాడైన చానిక్యుని మాటలు పట్టించుకోలేదు..
సిగముడి విడిపోయి ఉన్నతాసనమునుండి లాగబడిన చాణక్యుడు నందులపై ఆగ్రహించి ఓ నందాధము లారా! అందరి మధ్యలో నన్ను ఇలా అవమానించారు. మిమ్మల్ని కూడా ఇదే విధంగా సింహాసనమునుండి లాగి, మీతలలను నరికి గానీ ఈ జుట్టు ముడి వేయను అని శపధము చేసి సభామందిరమును వదలి వెళ్ళిపోయాడు చానిక్యుడు..

అప్పుడు నందులదగ్గర సామంతునిగా ఉన్న చంద్రగుప్తుడు.. రహస్యంగా చానిక్యున్ని కలిసి వయసులో చిన్నవాడివైనా నిన్ను కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నాను నందులు నన్ను చాలా హింస పెడుతున్నారు.. ఈరోజు రాజ దర్బారులొ మీకు జరిగిన అవమానం నేను చూసాను మీ తెలివితేటలు నాకు తెలుసు నాకు సహాయం చేయండి నందుల బారినుండి నన్ను కాపాడండి అని వేడుకున్నాడు చంద్రగుప్తుడు.. సరే మన ఇద్దరి శత్రువు ఒక్కడే కనుక ఆ శతృవుని చంపి ఆ రాజ్యానికి నిన్ను రాజుని చేస్తా అని మాటిచ్చాడు చానిక్యుడు..

అనుకున్నట్టుగానె కొంత సైన్యాన్ని కూడగట్టుకుని తన తెలివితేటలతో తిరుగేలేని నంద వంశాని మట్టికరిపించి నంద సామ్రాజ్య సింహాసనంమీద చంద్రగుప్తున్ని కూర్చొబెట్టి మౌర్య సాంమ్రాజ్యాన్ని స్తాపించాడు చానిక్యుడు..
అలా చానిక్యుని రక్షణలో చంద్రగుప్తమౌర్యుడు రాజ్యాన్ని పాలించాడు..

చంద్రగుప్టుని మరణానంతరం బిందుసారున్ని సింహాసనం మీద కూర్చొబెట్టాడు చానిక్యుడు.. 

బిందుసారుడు ఉత్తరాన హిమాలయాలనుండి దక్షిణాన వింద్య పర్వతములవరకు మౌర్య సామ్రాజ్యాన్ని విస్తరింప జెసాడు చానిక్యుని సహాయంతో..

ఆ తరువాత బిందుసారుడు కూడా మరణించడంతో.. పిల్లవాడైన అశోకుడు సింహాసనం ఎక్కాడు

ప్రస్తుతం చానిక్యుడి వయసైపోయి మంత్రి పదవినుండి వైదొలగి..  తన తరువాత వారసునిగా రాదా గుప్తా అనే ఒక తెలివైన యువకుని అశోకునికి మంత్రిగా నియమించి
చానిక్యుడు ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటునాడు..

అటువంటి వ్యక్తి ఇప్పుడు మన రాజ్యంకి ఎందుకు వచినట్టొ అని ఆ వృద్ద మంత్రి చెప్పాడు..

సైరస్ ఇదంతా విని.. ముసలాడు మామూలోడు కాదన్నమాట.. అనుకున్నాడు

🌟🌟🌟🌟🌟

        తెల్లవారి పోతుందనగా రుక్కూ బుక్కు చదవడం ఆపి  అక్షరాలు సరిగా కనిపించడంలేదురా మిగతాది రేపు చదువుదాములే అనింది రుక్కూ..

అలాగే అన్నాడు రామ్

రేయ్ రామ్ ఈరోజు మనం హాస్పిటల్ కి వెళ్తున్నాముగా ఆనింది రుక్కూ..

రాం మౌనంగా ఉన్నాడు..

రాం మౌనంగా ఉండటం చూసి.. చీ దీనెమ్మ బతుకు అక్కడేమో ఐదేసిమందికి కడుపు చేసాడు ఒకడు.. 

ఇక్కడ ఒక్కదానికి కడుపు చెయ్యమంటే చెయ్యడం లేదు వీడు .. అసలు ఎంట్రా మీ మగాల్లకు నొప్పి.. ఏదైనా మాకేగా నొప్పి.. మొదటి నుండి బిడ్డ పుట్టేవరకు అన్నీ నొప్పులు, బరువులు, బాదలు మాకే.. ఒక్క ఐదు నిమిషాలు కల్లుమూసుకుని నా కడుపులో ఒక కాయ వెయ్యిరా అంటే వినవే అనింది రుక్కూ..

అయినా రామ్ ఏమీ మాట్లాడకుండా  ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు..
అసలు నువ్వు ఇలా మాట వినవు అని రుక్కూ బుక్కు పక్కన పెట్టి పిట్టగోడ ఎక్కి నిలబడింది బట్టలు లేకుండా..

అప్పుడు రామ్.. చూడు రుక్కూ ముందు గోడ మీద నుండి దిగు అన్నాడు రుక్కూ వైపు చూసి..

నేను దిగనురా..దిగనుగాక దిగను
నా కడుపులో నీ బిడ్డ పెరుగుతాడని మాటివ్వు దిగుతా లేదంటే దూకుతా ఆనింది రుక్కూ..

ఎంత అల్లరి చేస్తున్నావే.. సరే దిగు అలాగేలే అన్నాడు రాం

అబ్బా చా.. అలా కాదమ్మా... లేచి నిలబడి నీ_____డాష్ ని చేతిలో పట్టుకుని రుక్కూ నీ కడుపులో కాయ కాయిస్తా అని చెప్పు అప్పుడు దిగుతా ఆనింది..

(Redbull :- osi deeni esaalo)

రాం లేచి నిలబడ్డాడు బట్టలు లేకుండా..
అలాగే నీ కడుపులో పెరగబోయె బిడ్డకు తండ్రిని అవుతా అన్నాడు.

ఆమాట వినగానె రుక్కూ ఆనందంతో కాలు జారి క్రింద పడింది..

ఇంకా ఉంది
[email protected]

    

Bạn đang đọc truyện trên: Truyen2U.Pro