ఐతే ఈమె నా పిన్నంట్టావ్ అన్నాడు రాం..
ఆ ఫోటో ప్రకారం అంతే కదా రాం అనింది పక్కనున్న వల్లీ..
బావుంది.. ఈమె కథ
సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం..
నిన్ను.. ఎవరు.. పంపారు.. అన్నాడు రాం క్రితి వైపు తిరిగి..
నాకర్ధం కాలేదు అనింది క్రితి..
సరే మరోసారి అడుగుతా.. నిన్ను మా ఇంటికి ఎవరు పంపారు అన్నాడు.. రాం
ఎ.. ఎవ.. ఎవరో ఎందుకు పంపుతారురాం నీకు జరిగిన విషయం మొత్తం చెప్పాకదా అనింది క్రితి తడబడుతున్న గొంతుతో..
వల్లీ.. నీకు చెప్పడం మర్చిపోయా.. ఈమె బలే కథ చెప్పిందిలేనాకు అన్నాడు రాం వల్లీ వైపు చూసి..
హా.. నేనూ ఇప్పుడే విన్నా ఆ కథ.. అనింది వల్లి..
మీరు ఎందుకు ఇలా ఎగతాలిగా మాట్లాడుతున్నారో నాకు అర్దం కావడం లేదు అనింది క్రితి..
ఎందుకంటే ఆరోజు నా ఇంటికి వచ్చిన రోల్స్ రాయిస్ కారు ఈరోజు నీ ఇంటి ముందులేదు, అంతే కాదు చిరక్కళ్ రాజా వారి చిన్న కోడలు ముతక చీర కట్టుకుని చిన్న కొంపలో నా ముందుంది.. అడిగిందానికి సమాదానం చెప్పు లెదంటె షూట్ చేసిపడేస్తా అని కోపంతో గద్దించినట్టు చెప్పింది వల్లీ..
దాంతో క్రితి కొద్దిగా భయపడింది.. క్రితి చేతివేళ్లు భయంతో వనకడం రాం గమనించి.. ఎందుకు వల్లీ అలా అరిచి ఆమెను బయపెడతావ్ చూడు పాపం ఎలా వనికిపోతుందో అన్నాడు.. రాం
కొన్ని క్షణాల మౌనం తరువాత క్రితి మెల్లగా రాం వైపు చూసి.. నాకు తెలుసు.. నేను కచ్చితంగా పట్టుబడతా అని.. కానీ ఇంత త్వరగా పట్టుబడిపోతా అని అనుకోలేదు. కనీసం ఒక ఎడాదైనా పట్టుద్ది అనుకున్నా.. అని వనుకుతున్న కంటంతో చెప్పింది క్రితి.
ఇంకా నేను అడిగినదానికి సమాదానం రాలేదు అన్నాడు రాం.. సీరియస్గా..
వాల్లు నన్ను చంపేస్తారు.. అని అరిచి చెప్పింది క్రితి
ఎవరు అన్నాడు రాం..అంతే గట్టిగా
ఆ ఫొటోలో చివరి వ్యక్తి అనింది క్రితి..
ఎందుకు అన్నాడు రాం
ఎందుకంటే అతనే నన్ను మీ ఇంటికి పంపాడు.. అనింది క్రితి
ఎందుకోసం అన్నాడు రాం..
మీ ఇంట్లో ఉన్న ఆ పెయింటింగ్ ఎత్తుకు రావడానికి అనింది క్రితి
కానీ నువ్వు ఆ పెయింటింగ్ ఎత్తుకు రాలేదుగా అన్నాడు రాం
ఒరిజినల్ ని నేను తీసుకొచ్చా .. ఇప్పుడు మీ ఇంట్లో ఉంది డూప్లికేట్ అనింది క్రితి
అబద్దాలాడకు.. ఉదయం లెగవగానే నేను సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసా.. నువ్వు మామూలుగా నడుచుకుంటూ వెల్లి కారు ఎక్కి బయటికి వెల్లిపొయావ్ నీ చేతిలో ఎటువంటి పేయింటింగ్ లేదు అనింది వల్లీ..
ఆరోజు రాం నన్ను కలవడానికి హొటల్కి వచ్చాడు.. అప్పుడు నేను డ్రెస్ మార్చుకుని వస్తా అని శారీ కట్టుకుని వచ్చా అప్పుడు
నాతోపాటు డూప్లికేట్ కూడా తెచ్చా.. అనింది క్రితి
ఆరోజు నీ చేతిలొ ఏమీ లేదుగా అన్నాడు రాం..
అవును నా చేతిలో ఏమీ లేదు.. అది నా రెండు కాళ్ల మద్యలో ఉంది అనింది క్రితి..
కానీ.. అని ఏదో అడగబోయి ఒక్క క్షణం ఆగి వల్లి వైపు చూసి..
అడగలేకపోయాడు.. రాం
నాకర్ధమయింది ఎమడగాలనుకున్నావో.. నువ్వు నా చీర విప్పినప్పుడు నా రెండుకాల్ల మద్య ఏమీలేదు అదేకదా నీ సందేహం అనింది క్రితి..
ఆమాటకి వల్లీ ఆశ్చర్యంగా రాం వంక చూసింది..
క్రితి వైపు చూసి.. అవునన్నట్టు తలెగరేసాడు రాం
అంతకుముందే కదా రాం నేను బాత్రూంకి వెళ్లా మందు కొట్టి.. డూప్లికేట్ ని బాత్రూంలో దాచా.. అర్ధరాత్రి నువ్వు నిద్రపోయాక గోడమీద ఫ్రేం క్రిందికి దించి.. దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఒరిజినల్ తీసీ నేను తెచ్చిన డూప్లికేట్ అందులో పెట్టి ఎప్పటిలాగే గోడకు తగిలించా.. ఒరిజినల్ ని నా రెండు కాల్ల మద్యలో ఉంచుకుని నీ కారుతో వచ్చేసా.. అని వివరంగా చెప్పింది క్రితి
ఇప్పుడు ఆ పేయింటింగ్ ఎక్కడ ఉంది.. అడిగాడు రాం..
ఆ ఫొటోలో ఉన్న చివరి వ్యక్తి దగ్గర ఉంది అని చెప్పింది క్రితి..
వాడికి ఇది ఎందుకు అని అడిగాడు రాం..
ఏమో నాకు తెలియదు అనింది క్రితి
నేనూ సామరస్యంగా మాట్లాడతా కానీ వల్లీ నాలా కాదు.. తనగురించి నీకు ఈపాటికే అర్దమయుంటుంది నిన్ను చంపేసి ఆ ఫొటోలో ఉన్న వాన్ని కూడా పట్టుకుంటుంది అని వార్నింగ్ యిచ్చినట్టు చెప్పాడు రాం..
వాల్లు నన్ను చంపేస్తారు.. నాతోపాటు నా బిడ్డను కూడా చంపెస్తారు అని భయం భయంగా చెప్పింది.. క్రితి
ఎవరు వాల్లు అన్నాడు రాం..
వాళ్ళెవరో నాకు తెలియదు..
నేను బట్టల షాపుల్లో, ఫాన్శీ షాపుల్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతున్నా ఒకరోజూ ఒక వ్యక్తి నాదగ్గరకు వచ్చి ఒక ఇంట్లో ఒక పేయింటింగ్ ఉంది అది కొట్టేసి తీసుకోస్తే లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు..
ముందు నేను ఒప్పుకోలేదు.. కానీ వాల్లు పది లక్షలు ఇస్తాం అన్నారు.. డబ్బుకి ఆశపడి ఈ పని చేసా..
ఈ రోజు ఉదయం నాకు ఈ పని అప్పగించిన వ్యక్తి మరియు ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఇద్దరూ వచ్చి ఒరిజినల్ పేయింటింగ్ ని తీసుకెళ్లారు.. అనింది క్రితి
మరిడబ్బిచ్చారా అనిండి వల్లీ..
లక్ష ఇచ్చారు.. మిగతాడబ్బు పెయింటింగ్ ని లాబ్ టేస్టు చేశాక ఇస్తాం అన్నారు..
ఎలా ఇస్తాం అన్నారు వాల్లు.. అని అడిగింది వల్లీ
సాయంత్రం సిటీ బయటున్న దాబాలో కలవమన్నారు..అనింది క్రితి
ఐతే నీకు వాల్లు డబ్బివ్వరు.. అంతే కాదు వాల్లు నిన్ను చంపేస్తారుకూడా అన్నాడు రాం..
నీకు డబ్బు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఉదయమే మొత్తం ఇచ్చేవాల్లు.. మిగతా డబ్బు ఇస్తాం అనేవంకతో నిన్ను సిటీ బయట దాబాదగ్గరకు పిలిపించి చంపేస్తారు.. అన్నాడు రాం..
మీ ఆయన ఏం చేస్తుంటాడు అని అడిగాడు రాం..
మావారు చనిపోయారు అనింది క్రితి
మరి ఆ పెద్దావిడ ఎక్కడా.. అని అడిగాడు రాం
ఆవిడ పక్క వీదిలో ఉంటుంది.. ఆవిడకి ఈ ప్లాన్ కి సంభందంలేదు.. కొద్ది సేపు మా అత్తగారిలా నటిస్తే వెయ్యి రూపాయలు ఇస్తాఅంటే నాతో పాటు హొటల్ కి వచ్చింది..
మీ ఇంటికి కూడా.. తెలిసిన వ్యక్తిని కలవాలని చెప్పి తీసుకొచ్చా..
ఆవిడ కేవలం వెయ్యి రూపాయలకి.. ఇలా.. చా.. అన్నాడు రాం.. సిగ్గుగా లేదు డబ్బుకోసం ఇలాంటి పనులు చెయడానికి అన్నాడు రాం..
నువ్వంటే డబ్బులో పుట్టి పెరిగావ్.. రాం
నీలాంటి వాళ్లకు డబ్బవసరం ఎలా ఉంటుందో తెలియదు.. ఈ దేశంలో ఎంతమంది ఒక్కపూట మంచి భోజనం చెయడానికి ఆరాట పడుతున్నారో నీకు తెలుసా.. ఎంతమంది స్త్రీలు ఒకే చీర యాడాదంతా కట్టుకుంటున్నారో నీకు తెలుసా..ఎంతమంది టీనేజ్ గర్ల్స్ స్లమ్ములోపుట్టి ఖరీదైన హోటళ్లలో అర్ధరాత్రుల్లు మందు కొట్టి, సిగరెట్లతో కాల్చి, కొరడాలతో కొట్టి, పైశాచిక ఆనందాన్ని పొందే నీలాంటి డబ్బున్న వాల్లకి శారీరక సుఖాన్ని ఇస్తూ నరకం అనుభవి స్టున్నారో నీకు తెలుసా.. సిగ్గు కన్నా భయంకరమైనది మరొకటి ఉంది అదే ఆకలి.. దానిముందు అన్నీపనులు సబబుగానే అనిపిస్తాయ్ అనింది క్రితి.. గట్టి గట్టిగా అరుస్తూ..
కొన్ని క్షణాల మౌనం తరువాత.. రాం జేబులో నుండి చెక్ బుక్కు తీసీ ఇదిగో పాతిక లక్షలకు చెక్కు ఈఊరు.. వీలైతే ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపో. నువ్వు ఎక్కడున్నా వాల్లు నిన్ను చంపేస్తారు.. అని చెక్కు కృతికి ఇచ్చి వాల్లు ఏ డాబా దగ్గరకు రమ్మన్నారు నిన్ను అని అడిగాడు..
పంజాబీ నేషనల్ దాబా అనింది క్రితి
సరే సిద్దంగా ఉండు వాల్లు చెప్పిన టైంకి కచ్చితంగా దాబా దగ్గరకు వెళ్లు. అని చెప్పి రాం వల్లిలు తిరిగి ఇంటికి బయలు దేరారు..
ఇంటికి వేళ్ళే దారిలో ఒక షాపులో తెల్లని కుందేల్లను చూసింది వల్లీ..
రేయ్ కారాపరా అనింది వల్లీ
ఎందుకు అన్నాడు రాం..
తెల్లని కుందేల్లు ఎంత బావున్నాయో బలంగా అని రెండు కుందేల్లు కొనుక్కోచింది వల్లీ..
నన్ను చుసుకోవడానికే నీకు తీరిక ఉండటంలేదు పైగా ఈ కుందేల్లు నీకు అవసరమా అన్నాడు.. రాం
అగోరించావ్లే కారుపోనీ అనింది వల్లీ..
అనుకున్నట్టుగానె.. క్రితి దాబా దగ్గరకు వెళ్లింది.. నలుగురు వ్యక్తులు దాబాలో క్రితిని కలిశారు
మాతోపాటు మేము చెప్పిన చోటికి వస్తె డబ్బు ఇస్తాం అన్నారు వాల్లు..
క్రితి కుదరదనింది. .
వాల్లు బలవంతం చెయభోయారు..
అప్పటికే ఆ దాబాలో పదిమందిని పెట్టింది వల్లీ..
వల్లీ పురమాయించిన ఈ పదిమంది క్రితిని కలవడానికి వచ్చిన ఆ నలుగురిని మక్కెలిరగతీసి తీసుకొచ్చి రాం ఇంటి ముందు పడేసారు..
రాం బయటికి వచ్చి.. చూడండి మీరెవరో నాకు తెలియదు కానీ నాకు మిమ్మల్ని పంపినవాడి అడ్రస్ కావాలి ఎవరు చెప్తే వారు మాత్రమే ప్రానాలతో ఉంటారు. అని బెదిరిపులా అడిగాడు రాం
వాల్లు ఏమీ మాట్లాడలేదు..
మరోసారి నేను అడగను అన్నాడు రాం..
ఐనా వాల్లు నోరు విప్పలేదు..
ఇంట్లో నుండి వల్లీ వచ్చి గన్ తో ముగ్గురిని టపా టపా షూట్ చేసింది.. ముగ్గురు చచ్చి పడి ఉన్నారు..
దంతో నాలుగవ వాడు భయపడి పోయి మొత్తం చెప్పాడు వివరంగా.. అతని పేరు లింగస్వామి అతని అడ్రస్ తదితర వివరాలు .. తరువాత నాలుగవవాన్ని కూడా చంపేసింది వల్లీ
పాపం అడ్రస్ చెప్పిన వాన్ని వదిలేస్తా అని వాల్లకి మాటిచ్చా వల్లీ అన్నాడు రాం..
నీ మాటలు మడిచి నీ రుక్కూ గు__లో పెట్టుకో.. నా ఇంటికి గాని నావాడికి గాని హాని అనిపిస్తే ఎవడికైనా ఇదేగతి అనింది వల్లీ కోపంగా..
పైగా ఒక ఆడ పిల్లని చంపడానికి దాబాకి వచ్చారు.. అప్పుడే అర్ధ మవుతుంది వీళ్లు ఎంత కిరాతకులో అటువంటి వీళ్ళని బ్రతకనిస్తేనే పాపం అని.. రేయ్ నలుగురుని తీసుకెళ్లి ఏం చెయ్యాలో తెలుసుకదా అనింది పక్కనున్న పదిమందితో..
తెలుసు మేడమ్ అని ఆ పదిమంది.. కిందపడిఉన్న నాలుగు సెవాలను తీసుకెళ్లారు..
వల్లీ ఎవరికో ఫోన్ చేసి.. ఫోన్లో ఒక వ్యక్తి గురించి చెప్పి వాడి పేరు లింగస్వామి, వాడి అడ్రస్ కూడా చెప్పి.. వీన్ని ఏత్తుకొచ్చేయండి అనింది..
అవతలి వాడు అలాగే మేడమ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు..
రాం గుడ్లప్పగించి వల్లినే చూస్తు.. మా నాన్న దీన్ని ఎప్పటికీ వదలకురా అని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్ధ మయింది అనుకున్నాడు మనసులో
రాం రా భోజనం చేద్దాం.. అనింది ఏదో ఆలో చిస్తూ నిలబడిపొయిన రాంతో
ఇద్దరూ వెల్లి బోజనానికి కూర్చున్నారు..
షాన్ ని పిలవకపోయావా అన్నాడు రాం..
ఔట్ హౌస్ లో ఉంది.. తను ఈ వైలెన్స్ చూసి తట్టుకోలెదని బయటికి రావద్దని చెప్పా..
నువ్వు తిను తరువాత నేను భోజనం తీసుకెళ్లి ఇస్తాలే ఆ పిల్లకి అనింది వల్లీ..
భోజనం ప్లేటు ముందు పెట్టుకుని చికెన్ చేసావా అన్నాడు రాం..
కాదు.. కుందేలు కర్రీ అనింది వల్లీ..
ఎంటీ కుందేలా.. అని షాక్ అయ్యాడురాం..
చాలారోజులయింది కుందేలుకూర తిని అందుకే కొన్నా అనింది వల్లీ..
బొద్దుగా ఉన్నాయ్ అంటే పెంచుకోవడానికి అనుకున్నా.. అన్నంలో నంజుకోవడానికి అనుకోలేదు అన్నాడు రాం..
అలా వారు భోజనం చెసారు..
ఆ తరువాత కొంతసేపటికి వల్లీ పంపించిన మనుషులు లింగస్వామిని ఎత్తుకొచ్చారు.. యాభైఎల్లుంటాయి అతనికి..
అతన్ని ఇంటిముందు మోకాళ్ళమీద కూర్చొపెట్టారు వల్లి రాం లు ఇంట్లోనుండి బయటికి వచ్చి.. మోకాళ్ళ మీద కుర్చున్న ఆయన్ని
నీ పేరు లింగుస్వామే కదా.... ఎందుకు లింగస్వామి ఇదంతా చెసారు అని అడిగాడు రాం..
నన్ను చంపితే చంపేయ్ లేదంటే వదిలేయ్.. ఎందుకంటే నా నోటివెంట ఏమీచెప్పించలేవు అన్నాడు లింగుస్వామి..
హో అలాగా.. బాగా ప్రిపేరయి వచ్చినట్టున్నావ్.. మరి నా ప్రిపరేషన్ నాకు ఉండాలిగా.. రేయ్ ఆ మిగతా వాల్లనికూడా తీసుకు రండి అని పక్కన నిలబడి ఉన్న ఒకడికి చెప్పింది వల్లీ.. వాడు వెల్లి పక్కన వ్యానులొ కట్టేసి ఉన్న లింగు స్వామి భార్యా పిల్లలను కూడా తెచ్చాడు..
ఇంకొకల్లని వదిలేసావెంట్రా అనింది వల్లీ..
సారీ మేడమ్ అని.. మరో వ్యానులో నుండి ఒక పాతికేళ్ల అమ్మాయి ఆమెతో పాటు ఒక చంటి బిడ్డను కూడా తెచ్చాడు వాడు.. మొత్తాన్ని లింగు స్వామి పక్కన కూర్చొపెట్టారు..
సినిమాలో చుపించినట్టు.. లింగు స్వామి భార్యా ఒకటే గోల ఎవరుమీరు మమ్మల్ని ఎందుకు ఎత్తుకొచ్చారు అని..
అరవకుండ ప్రశాంతంగా ఉండండి.. పనయ్యాక అందరిని పంపిస్తా అన్నాడు.. రాం
ఇకపోతే చూడు లింగస్వామి.. నీ పాత బార్య మరియు కొత్త ప్రియురాలు , వాల్ల పిల్లలసమెతంగా విచ్చేసి ఉన్నారు.. ఇప్పుడు చస్తావా చెప్తవా అన్నాడు రాం..
లింగస్వామి ఏమీ మాట్లాడలేదు..
వల్లీ తుపాకి తీసీ లింగస్వామి ప్రేయసిని ఆమె బిడ్డని షూట్ చేసింది.. వాల్లు కిదపడ్డారు
దాంతో లింగస్వామి బయపడిపోయాడు
మరలా లింగు స్వామి భార్యను కూడా షూట్ చేసింది ఆమెకూడా పడిపోయింది..
ఇక మిగిలింది నీ పిల్లలే లింగం.. నోరు విప్పుతావా అనింది వల్లి..
అతనిపేరు గోవిందరామన్, చిరక్కళ్ సంస్తానానికి మకుటంలేని మారాజు.. అని వివరంగా చెప్పాడు లింగం..
గుడ్..
వల్లీ.. రేపే మనం చిరక్కల్ రాజుగారి దర్శనానినకి వెళదాం అంతా సిద్దం చేయి అని చెప్పి రాం లోనికి వెళ్లాడు..
రాం వెళ్ళాక.. రేయ్ రాజుగారి దర్శనం అయ్యెంత వరకు వీళ్ళని మన గూడంలో ఉంచండి.. వాల్ల పిల్లలువెళ్లే స్కూలికి ఫోన్ చేసి పిల్లలకు లీవు కావాలని అడగండి.. పాపం పిల్లలని ఇందులోకి లాగకూడదుగా అనింది వల్లీ..
ఆ పడిపోయిన వాల్లకి మెలుకువ వచ్చాక కాస్త జూసు ఇవ్వండి.. ఇక వెళ్లండి.. అనింది వల్లి..
ఎంటీ పడిపోయిన వాళ్ళా.. వాల్లు చచ్చిపోలేదా అన్నాడు లింగం ఆశ్చర్యంగా.
లేదు లింగం.. ఇది నిజమైన గన్ కాదమ్మా.. పశువులకు మత్తు ఇవ్వడానికి వాడే గన్.. ఈ పొలాల్లో అప్పుడప్పుడు ఏనుగులు వస్తుంటాయి వాటిని పడుకొబెట్టడానికి వడతాము..
అని వల్లీకూడా లోపలికి వెళ్లింది..
వల్లీ వెళ్లగానే.. వల్లీ మనుషులు లింగం ని అతని రెండు ఫామిలీస్ ని వ్యాన్ లో ఎక్కించుకుని గోడంకి తీసుకెళ్లారు..
ఇంట్లో రెడీ అవుతున్న రాం.. వల్లీ నేను బయటికి వెళ్తున్నా రేపు ఉదయం వస్తా అని చెప్పాడు..
ఎక్కడికీ.. దానింటికేగా... వెళ్లు వెళ్లు ఏదో ఒకరోజు ఉందే మీ ఇద్దరికీ నాచేతిలో అనింది వల్లీ..
అది వింటూ నవ్వుకుంటూ బయటికి వెళ్లాడు రాం..
☆☆☆☆☆
రుక్కూ ఇంట్లో నుండి మధుకి ఫోన్ చేసి.. మదు ఎక్కడున్నావ్ అనింది..
సుబ్బూ వాల్ల ఇంట్లో రెడీ అవుతున్నా నీ దగ్గరకు రావడానికే అనింది మదు
ప్రోగ్రాం కాన్సిల్.. అనింది రుక్కూ
ఎంటీ సడెన్గా ఈ చెంజ్ అనింది మదు..
ఇప్పుడే రాం ఫోన్ చేసాడు.. ఇక్కడికి వస్తున్నాడంట.. వాడూ నేనూ చిన్న పనిమీద బయటికి వెళ్తున్నాం అనింది రుక్కూ..
హో.. అవునా ఐతే ఓకె.. నేను చూసుకుంటాలే అనింది మదు
మూడేల్ల క్రితం జరిగిన కథ
ఉదయాన్నే లేచి నీటుగా రెడీ అయి రాజన్ ప్రొఫిసర్ ఇంటికి వెళ్లాడు.. సమయం ఎనిమిది అవుతుంది..
ప్రొఫిసర ఒక గవర్నమెంట్ ఉద్యోగి కావడం వలన ఆయన తప్పక రోజూ ఆఫీసుకి వెళ్లాలి..
ఆరోజు కూడా ఆఫీసుకు వెళుతూ అప్పుడే ఇంటికి వచ్చిన రంగరాజన్ తో చూడు రాజన్ నేను పనిచేసేది గవర్నమెంట్ కోసం కానీ నా ప్రతిభను గుర్తించి ఒక పెద్ద ప్రైవేటు కంపెనీ నాకు ఒక ప్రాజెక్ట్ అప్పగించింది..నేను దాన్ని చాలా రహస్యంగా పూర్తి చేయాలి..అందుకే ఈ ఫీల్డులో ఎవ్వరితోఎటువంటి పరిచయాలు లేని నిన్ను చేర్చుకున్నా.. నా బార్య కూడా ఈ ప్రాజెక్ట్ మీదే పని చేస్తుంది.. ఆమె మేడ మీద ఉన్న మన ప్రైవేటు ఆఫీసులో నువ్వు ఏమీ చెయ్యాలి అని చెప్తుంది నువ్వు అది మాత్రం చెప్తే చాలు అని పొఫిసర్ వెళ్లిపోయారు..తరువాత రాజన్ మెల్లగా మేడమీదకు వెళ్లాడు..అక్కడ ఒక యాభైఏళ్ల ఒకావిడ కంప్యూటర్ ముందు కూర్చుని జియోలాజికల్ గ్రాఫిక్ ఇమేజస్ ని చూస్తుంది..
అప్పుడే రాజన్ ఆ ఆ గది ముందు నిలబడి మే ఐ కమీన్ మేడమ్ అన్నాడు..
కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్న ఆవిడ రాజన్ వైపు చూసి.. హా రా నీకోసమే ఎదురు చూస్తున్నా..
నీ పేరు రంగా కదు అనింది ఆమె..
అవును మేడమ్ అన్నాడు రంగా..
మనం చేసేపని చాలా రహస్యంగా ఉంచాలి ఎవ్వరితోనూ దీని గురించి మాట్లాడకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకొ.. ఇక పని విషయానికి వస్తే పురాతనమైన విశయాలగురించి మనం వెదుకుతున్నాం.. ఇటువంటి విషయాలగురించి పని చేయాలంటే మనకు ఆమోగమైన ఊహాశక్తి ఉండాలి..
ఉదాహరణకు: ఎడారి దేశం లో నివసించె మొగలాయులు భారతదేశంపై ఎందుకు దండయాత్రలు చేసారో చెప్పూ.. అనింది ఆవిడ..
రాజ్య కాంక్ష అన్నాడు రాజన్..
మద్యదరా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి వాల్ల చుట్టు పక్కల కానీ వారు ఎక్కడో మారు మూలన చుట్టూ నీల్లు ఉండి ద్వీపకల్పం లా ఉన్న మన దేశమే కావలసి వచ్చిందా పైగా అప్పుడు మన దేశం ఎన్నో వ్యాదులతో పీడించ బడుతుంది..అటువంటి రాజ్యం వారికి కావలసి వచ్చిందా అనింది ఆమె..
రాజన్ మౌనంగా ఉన్నాడు..
ప్రపంచంలో ఎన్నో సారవంతమైన భూముల్లో భారత దేశం ఒకటి. ఎంత సారవంత మైనదంటే ఈరోజుకీ వందకోట్ల మందికి అన్నం పెడుతుంది ఈ భూమి.. ఎలాగో తెలుసా ప్రపంచంలో మరే దేశంలోనూలేని గొప్ప నదీ వ్యవస్త మన దేశంలో ఉంది.. మరో కొన్ని వేల ఏళ్ల వరకు ఈ వేద భూమి ప్రజలకు అన్నం పెడుతుంది.. రాను రానూ గ్లోబల్ వార్మిగ్ వలన వేడి ఎక్కువైపోయి ఎడారి దేశాలన్ని నివాసానికి పనికిరాకుండా పోతాయి.. మరి అప్పుడు వాల్లు ఎక్కడికి పోతారు..
చల్లని హిమాలయాల కింద ఉన్న అతి పెద్ద నదీ వ్యవస్త కలిగి.. అన్నీ రకాల ఆహార పంటలకు అనుగుణంగా ఉండి..
అతి శీతల మరియు అతి ఉష్ణ కాకుండా సమతల సీతోష్ణస్తితి కలిగి ఉండి..
చుట్టూ నీటితో ఒక పక్క మంచు కోటతో దుర్భేద్యమైన రక్షణ సౌకర్యం కలిగి ఉండి..
ఎన్ని కోట్ల మందికైనా ఎన్నేళ్ల పాటైనా అన్నం పెట్టి.. ఇన్ని విదాల
చల్లగా చూసుకునే అన్నపూర్నెశ్వరి లాంటి భూమి ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచంలో.. అందుకే ఎడారి దేశాల్లో ఉండే వీళ్లు భవిష్యత్తులో వచ్చే ఉపదృవాన్ని ఊహించి వాళ్లకు అ ఉవుగా ఉన్న ఒక నేలను ఎంచుకుని మన దేశంపై దాడులకు దిగారు.. కానీ రాజన్ ఏ దేశంలోనైనా నేల అంటే మట్టిగా భావిస్తారు.. కాని మనదేశంలో మట్టి అంటే అమ్మ.. ఈ భరతమాత నుండి ఈ బిడ్డలను వేరు చేయడం ఎవరి వల్లాకాదు..
అది చరిత్రలోఐనా భవిష్యత్తులోఐనా.. అని స్పీచ్ యిచ్చినట్టు చెప్పింది ఆమె..
రాజన్ అలా బొమ్మాలా ఉండిపోయాడు ఆమె మాటలకి..
సరే ఇప్పుడు నా స్పీచ్ అంత ముక్యం కాదు..
మనం మన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం..అని
కంప్యూటర్లో ఒక ఫోటో చూపించింది..
ఎవరు ఇతను అని అడిగాడు రాజన్
ఇతని పేరు అగస్త్య.. దాదాపు ఆరువందల ఏళ్ల క్రితం అనుకుంటా.. ఈన ఎన్నో విషయాలను కనిపెట్టారు.. అందులో ఒకటి అలెక్జాండర్ భారతదేశంపై దండెత్తి వోడిపోయి తిరిగి వెల్లిపోతూ తక్షశిలనుండి ఒక విలువైన రత్నాని ఎత్తుకెల్లాడని చెప్పాడు..
ఇప్పుడు మనం ఆ రత్నాన్ని వెదుకుతున్నాం.. ఈపని ఒక పెద్ద ప్రైవేటు కంపెనీ మనకు అప్పగించింది ఆ రత్నాని కనిపెట్టి వాళ్లకు ఇవ్వాలి..అనింది ఆమె
మామూలుగా నాకు చిన్నప్పుడు ఇటువంటి విషయాలపై నమ్మకం ఉండేది కాదు. ఒక చిన్న స్కూల్లో పదవ తరగతి పిల్లలకు లెక్కలు చెప్పుకునే సాదారన టీచర్ని. కానీ నాకు పెల్లైయ్యాక మా ఆయనిలాగే నేనూ మారిపోయా. పురాతన విషయాలగురించి ఆలోచించడం మొదలుపెట్టా. గత ముప్పైఏళ్లుగా జీవితంలో సుఖాలు సంతోషాలు అనేవి ఉంటాయన్న సంగతికూడా మరిచిపోయి అనింది ఆమె..
సరే ఇప్పుడు అవెందుకుగానీ
ఈ అలెక్జాండర్ గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి భారతీయుల పాయింట్ ఆఫ్ వ్యూలో మరుయు గ్రీకుల పాయింట్ ఆఫ్ వ్యూలో.. నువ్వు వీలైనన్ని విషయాలను సేకరించు ఇంటర్నెట్ ద్వారా, లైబ్రరీల ద్వారా పురాతన గ్రందాల ద్వారా ఎన్నో విషయాలను చదువు అప్పుడే నువ్వు నాకు ఈ ప్రాజెక్టులో సహాయపడగలవు అనింది ఆమె..
అలాగే మేడమ్ అన్నాడు రాజన్..
నువ్వు నన్ను మేడమ్ అనక్కర్లేదు నా పేరు మేరీ నువ్వు నన్ను మెరీగారు అన్నా పరవాలేదు అనింది ఆమె..
అలా మొదటి రోజు ముగించుకుని అక్కడి నుండి బయటికి వచ్చాడు రాజన్..
అప్పుడే కాలేజీ నుండి బయటికి వచ్చిన రామలక్ష్మి రాజన్కి ఫోన్ చేసి ఎలా ఉంది కొత్త జాబ్ అనింది..
హుమ్.. నా లాంటి మట్టి బుర్రని ఉన్నట్టుండి తెలివైన వాడిలా మారిపొంమ్మంటె ఎలా అన్నాడు..రాజన్
అంత కష్టంగా ఉందా అనింది లక్ష్మి..
సర్లే బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలిగా ఎక్కడున్నావ్ అన్నాడు రాజన్..
ఇప్పుడే కాలేజీ అయిపోయి బయటికి వచ్చా.. కుదిరితే కాలేజీ పక్కన ఉన్న ఉన్న కాఫీషాపుకి రా అనింది లక్ష్మీ
సరే వస్తున్నా ఉండు అని రాజన్ లక్ష్మీని కలవడానికి వెళ్లాడు..
రాజన్ అక్కడికి వెళ్లేసరికి లక్ష్మీ రాంతో ఉంది..
రాజన్ రాగానే.. రాం ఇతను " రాజన్ " నా పాత కొలీగ్..
రాజన్ ఇతను నా స్టూడెంట్ పేరు " రాం " అని పరిచయం చేసింది..
(రాం కి పురాతన విషయాలు చరిత్రలో దాగిన అద్భుతాల గురించి ఆశక్తి ఉండటం వలన రాజన్ పురాతన విషయాలను సోదిస్తూ ఉండటం వలన వారి మద్య స్నేహం ఏర్పడింది కొద్దిరోజులలోనే ఆ స్నేహం బలపడింది..)
రాం, రాజన్ లు మాట్లాడుకుంటున్నారు.. రామ లక్ష్మీ ఫోన్ తీసుకుని అలా పక్కకు వెల్లి. మేరీకి ఫోన్ చేసి ఎలా ఉన్నాడు రాజన్ పనికొస్తాడా అనింది లక్ష్మీ..
మొదటి రోజేగా.. పోను పోను మెల్లగా దగ్గరచేసుకుంటాలే అనింది మేరీ..
ఇంతకాలానికి సుఖం గుర్తొచ్చిందా లెక్కలమెడమ్.. జాగ్రత్త ఈ వయసులో సాహసాలు చేయకు అనింది లక్ష్మీ..వెటకారంగా..
పోవే కొంటె పిల్లా..నువ్వేమీ మారలేదు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడూ అలానే ఉన్నావ్.. ఎన్నేల్లైనా నువ్వూ, ఆ స్కూలు, రెక్కలు విరిగిన ఆ కుర్చీ ఎప్పటికీ మరిచి పోలేను నేను అనింది మేరీ..
నిజమే అనుకో అప్పుడంటే యంగు ఎలా చేసినా చెల్లింది ఇప్పుడు అలా కాదుగా అనింది లక్ష్మీ..
ఈ విషయంలో నీకే పాటాలు నేర్పినదాన్నే నేను.. నువ్వు నాకు చెప్టున్నావా.. ఐనా ఇప్పుడు మాత్రం నాకు ఏమంత వయసైందనీ.. నేను ఇంకా యంగే అనింది మేరీ..
అవును.. నువ్వు నాకు ఎన్నో నేర్పించావ్ జీవితంలో ఎన్నో మదురమైన అనుభూతులను నాకు స్కూల్లోనే అందించావ్.. నేనూ నిన్ను ఎప్పటికీ మరిచిపోను అనింది లక్ష్మి..
సరే బాయ్ అని అటువైపు నుండి ఫోన్లో ఒక ముద్దు వచ్చింది..
రామలక్ష్మీకూడా బాయ్ అని దానికి బదులుగా ఒక ముద్దు ఇటువైపునుండి పంపించింది..
ఇంకా ఉంది
[email protected]
Bạn đang đọc truyện trên: Truyen2U.Pro